Uttar Pradesh: చనిపోయాడని ఆరు గంటలపాటు ఫ్రీజర్లో.. తర్వాత ఏం జరిగిందంటే!
చనిపోయాడని నిర్ధరించి ఆసుపత్రి మార్చురీలో ఉంచిన ఓ వ్యక్తి గుండె మళ్లీ కొట్టుకుంది. ఆరు గంటలపాటు ఫ్రీజర్లో ఉన్నప్పటికీ అతడు బతికి బయటపడటం ఓ అద్భుతమని వైద్యులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు......
దిల్లీ: చనిపోయాడని నిర్ధరించి ఆసుపత్రి మార్చురీలో ఉంచిన ఓ వ్యక్తి గుండె మళ్లీ కొట్టుకుంది. ఆరు గంటలపాటు ఫ్రీజర్లో ఉన్నప్పటికీ అతడు బతికి బయటపడటం ఓ అద్భుతమని వైద్యులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్లోని మొరాదాబాద్కు చెందిన శ్రికేష్ కుమార్ (45) రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. తీవ్రంగా గాయపడిన శ్రికేష్ను స్థానికులు ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే అతడు మృతిచెందినట్లు పరీక్షించిన వైద్యుడు నిర్ధరించాడు. దీంతో పోస్టుమార్టం కోసం అతడిని ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
వ్యక్తి మృతి పట్ల ఆసుపత్రివర్గాలు పోలీసులకు సమాచారం అందించాయి. అతడి కుటుంబ సభ్యులు వచ్చే వరకు శ్రికేష్ కుమార్ను ఆసుపత్రి మార్చురీలోని ఫ్రీజర్లో ఉంచారు. ఆరు గంటల తర్వాత పోస్టుమార్టంకు ముందు అతడి కుటుంబ సభ్యులు, పోలీసులు వచ్చి చూడగా.. అతడు శ్వాస తీసుకుంటున్నట్లు గుర్తించారు. విషయాన్ని వైద్యులకు తెలియజేయడంతో శ్రికేష్ను ఐసీయూకి తరలించారు. చికిత్స అందిస్తున్నామని, అతడు కోమాలో ఉన్నట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ పేర్కొన్నారు. ఫ్రీజర్లో ఆరు గంటలు ఉన్నప్పటికీ అతడు బతికుండటం ఓ అద్భుతమని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. బాధితుడు మృతిచెందినట్లు వైద్యులు పొరపాటుపడ్డారా? లేక మరేదైనా కారణమనా? అనే విషయంపై విచారణ జరుగుతున్నట్లు వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామక్రిష్ణ
ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా కుమార్ విశ్వజిత్, విజయవాడ పోలీస్ కమిషనర్గా పీహెచ్డీ రామక్రిష్ణను నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. -
భారాస అధినేత కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం
నల్గొండ జిల్లా వేములపల్లి వద్ద భారాస అధినేత కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం జరిగింది. -
అవనిగడ్డలో వైకాపా ర్యాలీ.. బాణసంచా పడి తెదేపా కార్యకర్త ఇల్లు దగ్ధం
కృష్ణా జిల్లా అవనిగడ్డలో వైకాపా అభ్యర్థి సింహాద్రి రమేశ్ బాబు నామినేషన్ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో అపశ్రుతి చోటు చేసుకుంది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఆ 80 కుటుంబాలకు రక్షణ కల్పించండి.. పోలీసులకు హైకోర్టు ఆదేశం
పల్నాడు జిల్లా ఆత్మకూరు గ్రామంలో 50, జంగమేశ్వరపాడు గ్రామంలో 30 కుటుంబాలకు రక్షణ కల్పించాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది. -
62వేల మంది వాలంటీర్లు రాజీనామా చేశారు.. కోర్టుకు తెలిపిన ఈసీ న్యాయవాది
ఏపీలో వాలంటీర్ల రాజీనామాల పిటిషన్పై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. -
జగన్పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి
సీఎం జగన్పై రాయి దాడి కేసులో నిందితుడు సతీష్ను కస్టడీకి ఇచ్చేందుకు కోర్టు అనుమతించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (24/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
పోరాడిన గుజరాత్.. ఉత్కంఠ పోరులో దిల్లీ విజయం
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!
-
ఓటరు జాబితాలో.. ‘డీ’ ఓటరు అంటే ఎవరు?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామక్రిష్ణ