konijeti Rosaiah : రోశయ్య అంత్యక్రియలు పూర్తి

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య అంత్యక్రియలు ముగిశాయి. కొంపల్లిలోని ఫామ్‌హౌస్‌లో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలను ..

Updated : 05 Dec 2021 18:39 IST

హైదరాబాద్‌ : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య అంత్యక్రియలు ముగిశాయి. కొంపల్లిలోని ఫామ్‌హౌస్‌లో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వివిధ పార్టీల నేతలు హాజరయ్యారు. పెద్దసంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. ఏపీ ప్రభుత్వం తరఫున మంత్రులు బొత్స సత్యనారాయణ, వెల్లంపలి, పేర్నినాని, బాలినేని హాజరయ్యారు.

ఈ ఉదయం రోశయ్య పార్థివదేహాన్ని అమీర్‌పేటలోని స్వగృహం నుంచి గాంధీభవన్‌కు తరలించారు. అక్కడ ప్రజలు, అభిమానుల సందర్శనార్థం ఉంచారు. ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ దూతగా వచ్చిన రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే రోశయ్య భౌతికకాయానికి అక్కడ నివాళులర్పించారు. కాంగ్రెస్‌ ముఖ్యనేతలు రోశయ్య భౌతికకాయం వద్ద పూలమాలలు ఉంచి అంజలి ఘటించారు. అనంతరం అక్కడి నుంచి అంతిమయాత్ర కొనసాగింది. కొంపల్లిలోని ఫామ్‌హౌస్‌లో అంత్యక్రియలు పూర్తి చేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని