Ts News: కొడుకులు సరిగా చూసుకోవడం లేదు.. జడ్జిని ఆశ్రయించిన వృద్ధ దంపతులు
కామారెడ్డి జిల్లాలో వృద్ధ దంపతులు న్యాయమూర్తిని ఆశ్రయించారు. తమ పిల్లలు తమను ఆదరించడం లేదని న్యాయమూర్తికి ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. కామారెడ్డి
కామారెడ్డి: కామారెడ్డి జిల్లాలో వృద్ధ దంపతులు న్యాయమూర్తిని ఆశ్రయించారు. తమ పిల్లలు తమను ఆదరించడం లేదని న్యాయమూర్తికి ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం అచ్చాయిపల్లికి చెందిన బెస్త ఆశయ్యకు ఆరుగురు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. అందరూ వివాహాలు చేసుకొని స్థిరపడ్డారు. కుమారులందరూ పక్కా ఇళ్లలో ఉంటూ వృద్ధ దంపతులను రేకుల షెడ్డులో ఉంచారు. అన్నం పెట్టకపోవడం, తన పేరుపై ఉన్న భూమిని ఇచ్చేయాలంటూ కుమారులు ఇబ్బంది పెడుతున్నారని ఎల్లారెడ్డి మున్సిఫ్ కోర్టు న్యాయమూర్తి అనితకు వృద్ధ దంపతులు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు స్వీకరించిన న్యాయమూర్తి.. వృద్ధ దంపతుల కుమారులు, కోడళ్లను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు. తల్లిదండ్రులను బాగా చూసుకోవాలని.. లేదంటే చర్యలు తప్పవని న్యాయమూర్తి హెచ్చరించారు. దీంతో కుమారులు, కోడళ్లు వృద్ధ దంపతులకు క్షమాపణలు చెప్పారు. బాగా చూసుకుంటామని హామీ ఇచ్చి వారి ఇంటికి తీసుకెళ్లారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విశాఖ-బెంగళూరు మధ్య ప్రత్యేక రైలు
వేసవిలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని విశాఖ- బెంగళూరు మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు వాల్తేర్ సీనియర్ డీసీఎం ఎ.కె.త్రిపాఠి తెలిపారు. -
పెళ్లి ఘట్టం.. క్యూఆర్ కోడ్లో నిక్ష్లిప్తం
రాజమహేంద్రవరానికి చెందిన అలికాని సత్యశివకుమార్(శివస్వామి), దుర్గాభవానీలు వినూత్న ప్రయత్నం చేశారు. -
మీమ్స్ తో ప్రచారం.. యువ ఓటర్లకు గాలం
ఎన్నికల్లో గెలవాలంటే అనర్గళంగా ప్రసంగిస్తూ.. అన్నివర్గాల ఓటర్లను ప్రసన్నం చేసుకోవడం.. గెలిస్తే ఏం చేస్తామో చెప్పడం.. ప్రత్యర్థి పార్టీని విమర్శించడం ఒకప్పటి ప్రచార శైలి.. -
ఓటాస్త్రం.. స్వీయచిత్రమే సాక్ష్యం
ఓరుగల్లు నగరంలో ఓటింగ్ శాతం పెంచేందుకు వరంగల్ కలెక్టరేట్ ఆవరణలో సెల్ఫీ పాయింట్ ఏర్పాటు చేశారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (20/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు
తాజా వార్తలు (Latest News)
-
వైకాపా నేతల సిఫార్సులతో పోస్టు.. మహిళా ఉద్యోగినులతో వెకిలి చేష్టలు
-
విశాఖ-బెంగళూరు మధ్య ప్రత్యేక రైలు
-
ఒలింపిక్స్లో పతకం తెస్తే బీఎండబ్ల్యూ కారు
-
పెళ్లి ఘట్టం.. క్యూఆర్ కోడ్లో నిక్ష్లిప్తం
-
పిల్లలతో అశ్లీల వీడియోలు తీయడం ఆందోళనకరం, నేరం : సుప్రీంకోర్టు
-
వివేకా హత్యలో నాపై రెండు క్రిమినల్ కేసులు.. అఫిడవిట్లో పేర్కొన్న అవినాష్రెడ్డి