Paralympics: స్వర్ణ పతక విజేత అవనికి జగన్‌, చంద్రబాబు అభినందనలు

టోక్యో పారాలింపిక్స్‌ షూటింగ్‌ విభాగంలో స్వర్ణ పతకం సాధించిన అవని లేఖరాకు సీఎం

Updated : 30 Aug 2021 13:25 IST

అమరావతి: టోక్యో పారాలింపిక్స్‌ షూటింగ్‌ విభాగంలో స్వర్ణ పతకం సాధించిన అవని లేఖరాకు సీఎం జగన్‌, తెదేపా అధినేత చంద్రబాబు అభినందనలు తెలిపారు. అత్యున్నత స్థాయి ప్రతిభ కనబరిచి సాధించిన ఈ విజయం భారత క్రీడా చరిత్రలో మైలురాయిగా నిలుస్తుందని జగన్‌ కొనియాడారు. అవనితో పాటు పతకాలు సాధించిన క్రీడాకారులందరికీ అభినందనలు తెలిపిన ఆయన.. భారత్‌ మరిన్ని పతకాలు సాధించాలని ఆకాంక్షించారు. పారాలింపిక్స్‌లో భారత్‌ తరఫున స్వర్ణ పతకం సాధించిన తొలి మహిళగా అవని నిలిచిందని చంద్రబాబు ట్వీట్‌ చేశారు. మన క్రీడాకారులు వివిధ విభాగాల్లో పతకాలు గెలిచి చరిత్ర సృష్టించారన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని