Ts News: గులాబ్‌ తుపాను ప్రభావం.. అప్రమత్తమైన వైద్యారోగ్య శాఖ

గులాబ్‌ తుపాను ప్రభావంతో భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో రాష్ట్రంలో అంటువ్యాధులు, నీటిసంబంధిత వ్యాధులు ప్రబలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అన్ని

Published : 28 Sep 2021 21:16 IST

హైదరాబాద్‌: గులాబ్‌ తుపాను ప్రభావంతో భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో రాష్ట్రంలో అంటువ్యాధులు, నీటిసంబంధిత వ్యాధులు ప్రబలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అన్ని జిల్లాల అధికారులను వైద్యారోగ్య శాఖ ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రజారోగ్య శాఖ సంచాలకులు (డీహెచ్‌) డా.శ్రీనివాసరావు జిల్లాల వైద్యారోగ్య శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. డీఎంహెచ్ఓలు, అన్ని స్థాయిల్లోని అధికారులు, వైద్య సిబ్బంది వారివారి హెడ్ క్వార్టర్స్‌లో అందుబాటులో ఉండాలన్నారు. ముందస్తు అనుమతి లేకుండా ఎవరికీ సెలవులు ఇవ్వొద్దని స్పష్టం చేశారు. జిల్లాల్లో జ్వరాలు ఉన్న ప్రాంతాల్లో తరచుగా ఫీవర్ సర్వే నిర్వహించడంతో పాటు వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రత్యేకించి వరద ప్రభావిత ప్రాంతాల్లో అంటువ్యాధులు, నీటిసంబంధిత వ్యాధులు ప్రబలకుండా డీఎంహెచ్‌ఓలు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. అధికారులు, నర్సింగ్, పారామెడికల్ సిబ్బంది తమ పరిధిలో క్షేతస్థాయిలో పర్యటించేలా చూడాలని.. విష జ్వరాలు, వ్యాధులు ప్రబలకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని