GHMC: హైదరాబాద్‌ రోడ్లపై భవన వ్యర్థాలు వేస్తున్నారా.. అయితే జాగ్రత్త!

హైదరాబాద్ నగర రహదారులపై ఇసుక, ఇతర వ్యర్థాలు వేస్తున్న వారిపై గ్రేటర్‌ హైదరాబాద్ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్ఎంసీ) చర్యలకు ఉపక్రమించింది.

Updated : 13 Sep 2021 15:39 IST

హైదరాబాద్‌: హైదరాబాద్ నగర రహదారులపై ఇసుక, భవన వ్యర్థాలు వేస్తున్న వారిపై గ్రేటర్‌ హైదరాబాద్ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్ఎంసీ) చర్యలకు ఉపక్రమించింది. ఇటీవల టాలీవుడ్‌ కథానాయకుడు సాయిధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురై చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఈ ఘటన తర్వాత రోడ్లపై వ్యర్థాలు వేసే వారిపై జీహెచ్‌ఎంసీ కఠినంగా వ్యవహరిస్తూ జరిమానాలు విధిస్తోంది. నగరంలోని మాదాపూర్ ఖానామెట్‌లో అరబిందో కన్‌స్ట్రక్షన్ కంపెనీకి జీహెచ్‌ఎంసీ అధికారులు రూ.లక్ష జరిమానా విధించారు. భవణ నిర్మాణాల సమయంలో రోడ్లపైకి చెత్త, ఇసుక, నిర్మాణ వ్యర్థాలు రాకుండా సంబంధిత నిర్మాణదారులు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు ఆదేశించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని