Hyderabad News: సికింద్రాబాద్‌ పరేడ్‌ మైదానం ప్లైఓవర్‌పై కారు దగ్ధం

సికింద్రాబాద్‌ పరేడ్‌ మైదానం ప్లైఓవర్‌పై కారు దగ్ధమైంది. అకస్మాత్తుగా కారులో మంటలు చెలరేగడంతో

Updated : 30 Nov 2021 12:37 IST

హైదరాబాద్‌: సికింద్రాబాద్‌ పరేడ్‌ మైదానం ప్లైఓవర్‌పై కారు దగ్ధమైంది. అకస్మాత్తుగా కారులో మంటలు చెలరేగడంతో ఆ మార్గంలో వెళుతున్న వాహనదారులు భయాందోళన చెందారు. కారు దగ్ధం వల్ల ప్లైఓవర్‌పై భారీగా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. ఉన్నట్టుండి వాహనంలో మంటలు రావడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. వెంటనే స్పందించిన పోలీసులు ప్లైఓవర్‌పై ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. క్రేన్‌ సాయంతో కారును అక్కడి నుంచి తొలగించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని