Hyderabad news: ప్రభుత్వ కార్యాలయాలకు పంద్రాగస్టు వెలుగులు

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు భాగ్యనగరం సర్వాంగసుందరంగా ముస్తాబైంది. ప్రభుత్వ కార్యాలయాలతో పాటు సచివాలయం బీఆర్కే భవన్‌, గన్‌ పార్క్‌, గోల్కొండ కోట, అసెంబ్లీ భవనాలు...

Updated : 14 Aug 2021 22:37 IST

హైదరాబాద్‌: స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు భాగ్యనగరం సర్వాంగసుందరంగా ముస్తాబైంది. ప్రభుత్వ కార్యాలయాలతో పాటు సచివాలయం బీఆర్కే భవన్‌, గన్‌ పార్క్‌, గోల్కొండ కోట, అసెంబ్లీ భవనాలు... విద్యుత్‌ వెలుగులు విరజిమ్ముతున్నాయి. నగరంలోని ప్రధాన ప్రాంతాలు రంగు రంగుల విద్యుత్‌ దీపాలతో కాంతులీనుతున్నాయి. బీఆర్కే భవన్‌ ప్రస్తుత సచివాలయానికి త్రివర్ణ పతాక రంగులతో  విద్యుత్‌ దీపాలను ఏర్పాటు చేశారు. గన్‌పార్క్‌లోని అమరవీరుల స్థూపంతో పాటు పరిసర ప్రాంతాలు, అసెంబ్లీ, విద్యుత్‌ సౌధ విద్యుత్‌ వెలుగులు విరజిమ్ముతున్నాయి. వీటితో పాటు పలు ప్రభుత్వ కార్యాలయాలను రంగురంగుల విద్యుత్‌ దీపాలతో అలంకరించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని