AP News: పోలవరంలో సీఎం జగన్‌ పర్యటన

ఏపీ సీఎం జగన్‌ పోలవరం పర్యటనకు వెళ్లారు. ప్రాజెక్టు పురోగతిని తెలుసుకునేందుకు పోలవరం

Updated : 19 Jul 2021 15:56 IST

పోలవరం: ఏపీ సీఎం జగన్‌ పోలవరం పర్యటనకు వెళ్లారు. ప్రాజెక్టు పురోగతిని తెలుసుకునేందుకు పోలవరం పరిసరాల్లో విహంగ వీక్షణం ద్వారా పనులను ఆయన పరిశీలించారు. అనంతరం క్షేత్రస్థాయిలో పనులు జరుగుతున్న తీరును అధికారులు సీఎంకు వివరించారు. స్పిల్‌ వే, అప్రోచ్‌ ఛానల్‌ పనులపై ఆయన అడిగి తెలుసుకున్నారు. స్పిల్‌ వే పనుల ఛాయా చిత్రాలను జగన్‌ పరిశీలించారు. పనుల తీరును ఈఎన్‌సీ నారాయణరెడ్డి సీఎంకు వివరించారు. అనంతరం పనుల పురోగతిపై అధికారులతో జగన్‌ సమీక్షించారు. అంతకుముందు పోలవరం వ్యూ పాయింట్‌ వద్ద నుంచి గోదావరి నదీ ప్రవాహ మార్గాన్ని సీఎం జగన్‌ పరిశీలించి వరద పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని