Dollar Seshadri: శ్రీవారి సేవలపై శేషాద్రి అవగాహన అనన్య సామాన్యం: సీజేఐ

తిరుమల శ్రీవారి ఆలయ ఓఎస్డీ డాలర్‌ శేషాద్రి మృతి పట్ల సీజేఐ జస్టిస్‌ ఎన్‌.వి.రమణ సంతాపం వ్యక్తం చేశారు.

Updated : 29 Nov 2021 13:15 IST

దిల్లీ: తిరుమల శ్రీవారి ఆలయ ఓఎస్డీ డాలర్‌ శేషాద్రి మృతి పట్ల సీజేఐ జస్టిస్‌ ఎన్‌.వి.రమణ సంతాపం వ్యక్తం చేశారు. శ్రీవారి సేవలపై శేషాద్రికి ఉన్న అవగాహన అనన్య సామాన్యమన్నారు. ‘‘ఆలయ ఆచారాలపై శేషాద్రికి ఎంతో అవగాహన పరిజ్ఞానం ఉంది. శేషాద్రి మృతి దేవస్థానానికి, భక్తకోటికి తీరని లోటు. వినూత్నంగా శ్రీవారి సేవల కోసం తాపత్రయపడ్డారు. ఆలయ వ్యవహారాలపై చెరగని ముద్ర వేశారు. డాలర్‌ శేషాద్రి నిష్క్రమణం ఎంతో బాధాకరం. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా’’ అని సీజేఐ జస్టిస్‌ ఎన్‌.వి.రమణ పేర్కొన్నారు. మరోవైపు రేపు తిరుపతిలో జరిగే శేషాద్రి అంతిమ సంస్కారాల్లో సీజేఐ పాల్గొననున్నట్లు సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని