TTD: శ్రీవారి ఎస్వీబీసీ ట్రస్టుకు ఎన్నారై భారీ విరాళం

తిరుమల శ్రీవారి ఎస్వీబీసీ ట్రస్టుకు ప్రవాస అమెరికాకు చెందిన ఎన్నారై రూ.4.20 కోట్ల విరాళం అందించారు. అమెరికాలోని బోస్టన్‌లో నివాసం ఉంటున్న ప్రవాస భారతీయులు రవి ఐకా.. తన ప్రతినిధి విజయవాడకు చెందిన రామకృష్ణ ప్రసాద్‌ ద్వారా విరాళం అందించారు. ..

Published : 16 Sep 2021 19:23 IST

తిరుమల: తిరుమల శ్రీవారి ఎస్వీబీసీ ట్రస్టుకు ప్రవాస అమెరికాకు చెందిన ఎన్నారై రూ.4.20 కోట్ల విరాళం అందించారు. అమెరికాలోని బోస్టన్‌లో నివాసం ఉంటున్న ప్రవాస భారతీయులు రవి ఐకా.. తన ప్రతినిధి విజయవాడకు చెందిన రామకృష్ణ ప్రసాద్‌ ద్వారా విరాళం అందించారు. ఈ మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం(తితిదే) అదనపు ఈవో ధర్మారెడ్డిని కలిసిన రామకృష్ణ ప్రసాద్‌ విరాళానికి సంబంధించిన డీడీలను అందజేశారు. రవి ఐకా ఇప్పటికే పలు ట్రస్టులకు దాదాపు రూ.40 కోట్ల వరకు విరాళంగా అందించారని ధర్మారెడ్డి తెలిపారు. ఎస్వీబీసీలో కెమెరాలు, ఇతర సాంకేతిక పరికరాల కొనుగోలు కోసం రూ. 7 కోట్లు విరాళంగా ఇచ్చేందుకు రవి ఐకా ముందుకొచ్చారని.. తొలి విడతగా రూ. 4.20 కోట్లు అందజేశారని వెల్లడించారు. ఈ మొత్తంతో ఎస్వీబీసీకి అవసరమైన స్టేట్ ఆఫ్ ఆర్ట్ కెమెరాలు, ఇతర సాంకేతిక పరికరాలు కొనుగోలు చేయనున్నట్లు ధర్మారెడ్డి తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని