ASER Report: రూటు మార్చిన చదువులు.. ప్రైవేటు నుంచి ‘ప్రభుత్వ బడులకు’!
గత మూడేళ్లలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరికలు గణనీయంగా పెరిగినట్లు ‘వార్షిక విద్యాస్థితి నివేదిక (ASER)-2021’ సర్వేలో వెల్లడయ్యింది.
ప్రభుత్వ పాఠశాలల్లో పెరుగుతోన్న చేరికలు - ASER సర్వే
దిల్లీ: దేశంలో గత కొంతకాలంగా ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు ప్రభుత్వ బడుల్లో చేరేందుకు మొగ్గు చూపుతున్నట్లు తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి. గత మూడేళ్లలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరికలు గణనీయంగా పెరిగినట్లు ‘వార్షిక విద్యాస్థితి నివేదిక (ASER)-2021’ సర్వేలో వెల్లడయ్యింది. ముఖ్యంగా ఉత్తర్ప్రదేశ్, కేరళ రాష్ట్రాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో చేరికలు అత్యధికంగా ఉన్నాయని తెలిపింది. విద్యాస్థితిని అంచనా వేసేందుకు దేశవ్యాప్తంగా 25 రాష్ట్రాలు, మూడు కేంద్రపాలిత ప్రాంతాల్లో అసర్ సర్వే నిర్వహించింది. వీటిలో 76,706 కుటుంబాలు, 5 నుంచి 16ఏళ్ల మధ్య వయసున్న 75,234 మంది చిన్నారులను సర్వే చేసింది. కొవిడ్ తర్వాత తిరిగి తెరచుకున్న 4872 పాఠశాలలతో పాటు తెరచుకోని 2427 పాఠశాలల ఇంఛార్జీల నుంచి సమాచారం సేకరించినట్లు అసర్ పేర్కొంది.
‘దేశవ్యాప్తంగా ప్రైవేటుతో పోలిస్తే ప్రభుత్వ పాఠశాలల్లో చేరికలు పెరుగుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా ఆరు నుంచి 14ఏళ్ల వయసున్న పిల్లలు ప్రైవేటు స్కూళ్లలో చేరడం 2018లో 32.5శాతం ఉండగా.. 2021నాటికి అది 24.4శాతానికి తగ్గింది’ అని 16వ అసర్ వార్షిక నివేదిక వెల్లడించింది. ఇదే సమయంలో 2018లో ప్రభుత్వ పాఠశాలల్లో 64.3శాతం ఉండగా.. ప్రస్తుతం అది 70.3శాతానికి పెరిగిందని తెలిపింది. అన్ని తరగతులతో చేరికలతో పాటు.. బాలురు, బాలికల సంఖ్యలోనూ ఈ పెరుగుదల కనిపించిందని పేర్కొంది. అయినప్పటికీ ప్రైవేటు స్కూళ్లలో చేరేవారి సంఖ్య బాలురలోనే ఎక్కుగా ఉన్నట్లు గుర్తించింది. ఇక దేశంలో 2006 నుంచి 2014 వరకు ప్రైవేటు స్కూళ్లలో చేరికలు విపరీతంగా పెరిగాయి. ఆ సమయంలో ప్రైవేటులో చేరికలు 30శాతం పెరిగాయి. కానీ, ఈ ఏడాది కరోనా వైరస్ వల్ల ప్రైవేటులో చేరికలు మరింత తగ్గినట్లు తాజా సర్వే వెల్లడించింది.
వివిధ రాష్ట్రాల్లో ప్రభుత్వ బడుల్లో చేరికల పెరుగుదల ఇలా..
* ప్రభుత్వ పాఠశాలల్లో చేరికలు ఉత్తర్ప్రదేశ్లో అత్యధికంగా 13.2శాతం పెరగగా.. కేరళలో 11.9శాతం పెరిగాయి.
* రాజస్థాన్లో 9.4శాతం, మహారాష్ట్ర - 9.2శాతం, కర్ణాటక - 8.3శాతం, తమిళనాడు - 9.6శాతం, ఆంధ్రప్రదేశ్ - 8.4శాతం పెరుగుదల కనిపించింది.
* తెలంగాణ - 3.7శాతం, బిహార్ - 2.8శాతం, పశ్చిమబెంగాల్ - 3.9శాతం, ఝార్ఖండ్ - 2.5శాతం ప్రభుత్వ పాఠశాలల్లో చేరికలు పెరిగాయి.
* 6 నుంచి 14ఏళ్ల వయసు పిల్లల చేరికల్లో మాత్రం ఎటువంటి తేడా కనిపించలేదు. 15-16 ఏళ్ల పిల్లలు ప్రభుత్వ బడుల్లో చేరడం గణనీయంగా పెరిగింది. 2018లో ఈ చేరికలు 57శాతంగా ఉండగా.. 2021 నాటికి 67.4శాతానికి పెరిగాయి.
* ఇదే సమయంలో బడిమానేసే పిల్లల సంఖ్య 12.1శాతం నుంచి 6.6శాతానికి తగ్గింది.
* 2020లో పాఠశాలల్లో నమోదు చేసుకోని పిల్లల సంఖ్య 1.4శాతం నుంచి 4.6శాతానికి పెరిగింది.
* ప్రభుత్వ పాఠశాలల్లో చేరికలు ఉత్తర్ప్రదేశ్, రాజస్థాన్, పంజాబ్, హరియాణా, మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఎక్కువగా ఉన్నాయి.
* అదే ఈశాన్య రాష్ట్రాల్లో మాత్రం ప్రభుత్వ పాఠశాలల్లో చేరికలు తగ్గుముఖం పట్టడంతో పాటు బడుల్లో నమోదు చేసుకోని చిన్నారుల సంఖ్య కూడా పెరిగింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
హైదరాబాద్ శివారులో వర్ష బీభత్సం.. శ్రీశైలం హైవేపై ట్రాఫిక్ జామ్
నగర శివారులో శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి శ్రీశైలం జాతీయ రహదారిపై ట్రాఫిక్ జామ్ అయింది. -
ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై షర్మిలకు ఈసీ నోటీసులు
ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు ఎన్నికల కమిషన్ నోటీసులు జారీ చేసింది. -
వైకాపా ప్రచార రథం ఢీకొని బాలుడి మృతి విషాదకరం: చంద్రబాబు
వైకాపా ప్రచారరథం ఢీకొని బాలుడు మృతి చెందిన ఘటన అత్యంత విషాదకరమని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
దిల్లీ మద్యం స్కామ్.. సీబీఐ కేసులోనూ అప్రూవర్గా మారిన శరత్ చంద్రారెడ్డి
దిల్లీ మద్యం కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. గతంలో ఈడీ కేసులో అప్రూవర్గా మారిన నిందితుడు శరత్ చంద్రారెడ్డి, సీబీఐ నమోదు చేసిన కేసులోనూ అప్రూవర్గా మారారు. -
సిద్దిపేటలో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్పై హైకోర్టు స్టే
సిద్దిపేటలో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్పై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. భారాస ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి సమావేశంలో పాల్గొన్నారని ఆరోపిస్తూ ఇటీవల వారిపై సస్పెన్షన్ వేటు వేశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
చిలుకూరు ఆలయంలో గరుడ ప్రసాదం పంపిణీ నిలిపివేశాం: రంగరాజన్
హైదరాబాద్ శివారులోని చిలుకూరు బాలాజీ ఆలయంలో గరుడ ప్రసాదం పంపిణీ నిలిపివేసినట్టు ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ తెలిపారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగనన్నా.. దాహం తీర్చవయ్యా!
వేసవి కాలం వచ్చింది. ఎండలు మండిపోతున్నాయి. నీటి ఎద్దడి ఏర్పడుతోంది. అధికారులు గుక్కెడు నీరు కూడా ఇవ్వలేకపోతున్నారు. దాహం తీర్చుకోవడానికి ప్రజలు నానాఇబ్బందులు పడుతున్నారు. ఇదీ పట్టణంలోని పలు ప్రాంతాల్లోని పరిస్థితి. -
పేదల పాలిట.. వి‘నాసి’కారే..!
రాష్ట్ర, చీప్ లిక్కర్కు కేంద్రంగా మారిపోయింది. ‘జే’బ్రాండ్ పేరుతో తీసుకొచ్చిన నాసిరకం మద్యం ప్రజల ప్రాణాలు హరిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పించినా ఈ ప్రభుత్వం లెక్క చేసిన దాఖలాలు లేవు. -
వినియోగదారులకు రెట్టింపు షాక్
ఐదేళ్ల పాలనలో ఇప్పటికే పలుమార్లు విద్యుత్తు ఛార్జీలు పెంచేసి సామాన్యులపై మోయలేని భారం వేసిన వైకాపా ప్రభుత్వం.. తాజాగా కొత్త మార్గంలో బాదుడు మొదలెట్టింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
20లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నాది: చంద్రబాబు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం
-
హైదరాబాద్ శివారులో వర్ష బీభత్సం.. శ్రీశైలం హైవేపై ట్రాఫిక్ జామ్
-
‘విక్రమార్కుడు’, ‘బజరంగీ భాయిజాన్’ సీక్వెల్స్ అప్డేట్.. ఎంతవరకు వచ్చాయంటే!
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!