AP News: కొడాలి నాని సహా మరో ముగ్గురికి భద్రత పెంపు
ఏపీ మంత్రి కొడాలి నాని సహా మరో ముగ్గురు ఎమ్మెల్యేలకు రాష్ట్ర ప్రభుత్వం భద్రత పెంచింది...
అమరావతి: ఏపీ మంత్రి కొడాలి నాని సహా మరో ముగ్గురు ఎమ్మెల్యేలకు రాష్ట్ర ప్రభుత్వం భద్రత పెంచింది. కొడాలి నానితో పాటు ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, అంబటి రాంబాబు, ద్వారంపూడి చంద్రశేఖర్రెడ్డిలకు అదనపు భద్రత కల్పించారు. ఇటీవల అసెంబ్లీలో జరిగిన పరిణామాల దృష్ట్యా వారికి భద్రత పెంచారు.
కొడాలి నానికి 2+2కు అదనంగా 1+4 గన్మెన్ల భద్రత.. ఆయన కాన్వాయ్లో అదనంగా మరో భద్రత వాహనాన్ని కేటాయించారు. మిగిలిన ముగ్గురు ఎమ్మెల్యేలకు అదనంగా 3+3 గన్మెన్లతో భద్రత కల్పించారు. అసెంబ్లీ పరిణామాలపై సామాజిక మాధ్యమాల్లో బెదిరింపులు వచ్చాయని.. ఈ నేపథ్యంలో ఫిర్యాదుల ఆధారంగా కొడాలి నాని, ముగ్గురు ఎమ్మెల్యేలకు భద్రతను పెంచినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’