TS News: విదేశాల నుంచి హైదరాబాద్ వచ్చిన 12మందికి కొవిడ్ పాజిటివ్
యావత్ ప్రపంచాన్ని కలవరపెడుతోన్న కరోనా కొత్త వేరియంట్ ‘ఒమిక్రాన్’పై తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. ముప్పు దేశాల నుంచి వచ్చే అంతర్జాతీయ ప్రయాణికులకు
హైదరాబాద్: ఒమిక్రాన్ భయాలు వెంటాడుతున్న వేళ విదేశాల నుంచి హైదరాబాద్కు వచ్చిన వారిలో 12 మందికి కొవిడ్ పాజిటివ్గా నిర్ధారణ కావడం కలకలం రేపుతోంది. నిన్న, ఇవాళ యూకే, కెనడా, అమెరికా, సింగపూర్ నుంచి వచ్చిన 12మంది ప్రయాణికులకు కొవిడ్-19 సోకినట్టు అధికారులు వెల్లడించారు. కొవిడ్ పాజిటివ్గా వచ్చిన 12 మందినీ టిమ్స్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. వారి నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్కు పంపారు. కొవిడ్ పాజిటివ్ వచ్చిన వారిలో లక్షణాలు కనిపించకపోవడం గమనార్హం. వీరిలో ఒమిక్రాన్ నిర్ధారణ కాకపోతే అందరినీ హోం ఐసోలేషన్కు పంపనున్నారు.
ఆ మహిళకు ముందు నెగెటివ్ అన్నారు.. కానీ పాజిటివ్
అలాగే, విదేశాల నుంచి నగరానికి వచ్చిన ఓ మహిళ (36)కు కరోనా పాజిటివ్గా తేలింది. కుత్బుల్లాపూర్ సర్కిల్ గణేష్ నగర్ సమీపంలోని రిడ్జ్ టవర్స్కు చెందిన సదరు మహిళ బుధవారం లండన్ నుంచి నగరానికి వచ్చారు. ఆమెకు శంషాబాద్ విమానాశ్రయంలో కొవిడ్ నిర్ధారణ పరీక్షలు చేశారు. అయితే, ఫలితాల్లో నెగెటివ్ వచ్చిందని చెప్పి ఎయిర్పోర్టు సిబ్బంది ఆమెను ఇంటికి పంపారు. కాసేపటి తర్వాత రిపోర్ట్స్ను పరిశీలించిన సిబ్బంది ఆ మహిళకు పాజిటివ్ వచ్చినట్లు గుర్తించి జీడిమెట్ల పోలీసులను అప్రమత్తం చేశారు.
దీంతో సీఐ బాలరాజు వెంటనే రిడ్జ్ టవర్స్ అసోసియేషన్ కార్యవర్గానికి సమాచారం అందించి మహిళకు తెలియజేశారు. అనంతరం అక్కడికి చేరుకొన్న జీడిమెట్ల పోలీసులు జరిగిన విషయాన్ని మహిళకు వివరించి ఆమెను నగరంలోని టిమ్స్కు తరలించారు. అక్కడ మరోసారి పరీక్షలు నిర్వహించగా పాజిటివ్గా తేలడంతో ఆ నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్ విశ్లేషణ కోసం పంపించారు. మహిళ తల్లిదండ్రులను సైతం హోం క్వారంటైన్లో ఉంచారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆన్లైన్లోనూ నామినేషన్ వేయొచ్చు: వికాస్ రాజ్
లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఆన్లైన్లోనూ నామినేషన్ దాఖలు చేయవచ్చని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ తెలిపారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఏపీ, తెలంగాణకు సాగర్ నీటి విడుదలపై కేఆర్ఎంబీ ఉత్తర్వులు
వేసవిలో తాగునీటి అవసరాల కోసం కృష్ణానది యాజమాన్య బోర్డు నీటి విడుదల ఉత్తర్వులు జారీ చేసింది. -
గరిష్ఠ ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం: వాతావరణ శాఖ
రాష్ట్రంలో గురు, శుక్రవారాల్లో కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ వడగాల్పులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. -
భద్రాచలంలో కనులపండువగా శ్రీరామ మహా పట్టాభిషేకం
శ్రీరామ మహా పట్టాభిషేక మహోత్సవ వేడుకతో గురువారం భద్రగిరి దివ్యక్షేత్రం పులకించింది. వేద మంత్రోచ్ఛరణల మధ్య సింహాసనాన్ని అధిష్ఠించిన రామచంద్రుడు భక్తకోటికి నేనున్నానంటూ కొండంత అభయమిచ్చాడు. -
జగన్పై రాయి దాడి కేసు.. ఆ ఆరుగురి వివరాలు తెలపాలంటూ కోర్టులో పిటిషన్
సీఎం జగన్పై రాయి దాడి వ్యవహారంపై విజయవాడ కోర్టులో పిటిషన్ దాఖలైంది. పోలీసుల అదుపులో ఉన్న ఆరుగురి వివరాలు తెలపాలంటూ న్యాయవాది సలీం ఈ పిటిషన్ వేశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
వదిన- మరదళ్ల సవాల్.. బారామతిలో నామినేషన్ వేసిన సుప్రియా, సునేత్ర
-
ఏపీలో నాలుగు బహిరంగ సభల్లో పాల్గొననున్న ప్రధాని మోదీ
-
ఆ టైంలో నేను దేశంలోనే లేను.. రెజ్లర్లపై వేధింపుల కేసులో బ్రిజ్ భూషణ్ పిటిషన్
-
తండ్రినయ్యాక ఆ అలవాటు మానేశాను: నిఖిల్
-
ఇరాన్ అదుపులో నౌక.. భారత సిబ్బందిలోని కేరళ యువతి క్షేమంగా ఇంటికి..
-
ముంబయి గెలవాలంటే.. హార్దిక్ ఫామ్ అందుకోవడం అత్యవసరం: ఫించ్