TTD news: శ్రీవారి దర్శన టికెట్ల సంఖ్యను పెంచే ఆలోచన లేదు: జవహర్రెడ్డి
కరోనా మూడో దశ హెచ్చరికల నేపథ్యంలో శ్రీవారి దర్శన టికెట్ల సంఖ్యను పెంచే ఆలోచన లేదని తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ఈవో జవహర్రెడ్డి వెల్లడించారు. తిరుమాఢ
తిరుమల: కరోనా మూడో దశ హెచ్చరికల నేపథ్యంలో శ్రీవారి దర్శన టికెట్ల సంఖ్యను పెంచే ఆలోచన లేదని తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ఈవో జవహర్రెడ్డి వెల్లడించారు. తిరుమాఢ వీధుల సమీపంలో ఉన్న ఉద్యానవనాలు, ఇతర ప్రాంతాలను అధికారులతో కలిసి ఈవో శుక్రవారం పరిశీలించారు. తిరుమలలో భక్తులకు ఆహ్లాదరకర వాతావరణం ఉండేలా పార్కులను ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్లు చెప్పారు. కాటేజీలు, రహదారుల పక్కన మొక్కలు పెంచాలని అధికారులకు సూచించారు. స్వామివారి అలంకరణకు ఉపయోగించే పూలను తిరుమలలోనే సాగు చేసేలా ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు.
స్వామివారికి కైంకర్యాలు, నైవేద్యాల తయారీకి వినియోగించే నెయ్యిని తిరుమలలోనే తయారు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు జవహర్రెడ్డి తెలిపారు. తిరుమల అన్నమయ్య భవన్లో నిర్వహించిన సమావేశంలో ఈవోతో పాటు కమిటీ సభ్యులు పాల్గొన్నారు. కమిటీ నిర్ణయం మేరకు దేశవాళీ ఆవు పాలతోనే స్వచ్ఛమైన నెయ్యి తయారు చేయాలని తీర్మానించినట్లు చెప్పారు. ఇప్పటికే గోఆధారిత వ్యవసాయం ద్వారా పండించే పంటతోనే స్వామివారికి నైవేద్యం సమర్పిస్తున్న తితిదే... స్వచ్ఛమైన నెయ్యిని స్వామివారికి సమర్పించేలా చర్యలు చేపట్టింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం