ఏపీ పిటిషన్‌ను కొట్టివేసిన సుప్రీం కోర్టు

ఎన్జీటీ ఆదేశాలను సవాలు చేస్తూ ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై మంగళవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.

Updated : 01 Feb 2021 13:55 IST

దిల్లీ: ఎన్జీటీ ఆదేశాలను సవాలు చేస్తూ ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై సోమవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా ..పురుషోత్తపట్నం పోలవరంలో అంతర్భాగమని ఏపీ ప్రభుత్వం వాదనలు వినిపించింది. విశాఖ తాగునీటి అవసరాలను పురుషోత్తపట్నం తీరుస్తుందని ప్రభుత్వం వాదనలు వినిపించింది. పర్యావరణ అనుమతులు తీసుకోవాలన్న ఎన్జీటీ ఆదేశాలను రద్దు చేయాలని ఏపీ ప్రభుత్వం కోరగా సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. అన్ని అంశాలు పరిశీలించాకే ఎన్జీటీ ఆదేశాలిచ్చిందని జస్టిస్‌ నారీమన్‌ ధర్మాసనం స్పష్టం చేసింది. ఎన్జీటీ ఆదేశాల్లో జోక్యం చేసుకోలేమని పేర్కొంటూ ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది.

ఇవీ చదవండి...

ఆదాయపన్ను చెల్లింపు దారులకు దక్కని ఊరట

20 ఏళ్లు దాటితే వాహనాలు తుక్కుకే..!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని