Tirupati: తిరుపతిలో వింత ఘటన

తిరుపతి శ్రీకృష్ణానగర్‌లో ఓ వింత ఘటన చోటుచేసుకుంది. భూమిలో నుంచి సిమెంటు రింగుల ట్యాంకు పైకి వచ్చింది. సిమెంటు రింగులతో చేసిన ట్యాంకును శుభ్రం చేస్తుండగా

Updated : 26 Nov 2021 11:28 IST

తిరుపతి: తిరుపతి శ్రీకృష్ణానగర్‌లో ఓ వింత ఘటన చోటుచేసుకుంది. భూమిలో నుంచి సిమెంటు రింగుల ట్యాంకు పైకి వచ్చింది. సిమెంటు రింగులతో చేసిన ట్యాంకును శుభ్రం చేస్తుండగా ఈ ఘటన జరిగింది. ఈ సంఘటనలో స్పల్ప గాయాలతో ఓ మహిళ బయటపడింది. 25 రింగుల్లో 18 సిమెంటు రింగులు భూమిపైకి వచ్చాయి. భూమిపైకి వచ్చిన రింగులను చూసి స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. వరద నీటి ఒత్తిడితో రింగులు పైకి వచ్చినట్లు స్థానికులు భావిస్తున్నారు.  తిరుపతిలో గత కొన్నిరోజులుగా భారీ వర్షాలు కురిస్తుండడంతో పలు ప్రాంతాలు నీట మునిగిన సంగతి తెలిసిందే.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు