TS: బీర్కూర్లో ఒక్కరోజే 60 కొవిడ్ కేసులు
తెలంగాణలోని కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండల కేంద్రంలో ఒక్కరోజే 60 కరోనా కేసులు నమోదయ్యాయి. మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 289 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 60 మందికి పాజిటివ్ నిర్ధారణ అయినట్లు వైద్యాధికారి రవిరాజా తెలిపారు. తాజా కేసులతో..
బీర్కూర్: తెలంగాణలోని కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండల కేంద్రంలో ఒక్కరోజే 60 కరోనా కేసులు నమోదయ్యాయి. మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 289 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 60 మందికి పాజిటివ్ నిర్ధారణ అయినట్లు వైద్యాధికారి రవిరాజా తెలిపారు. తాజా కేసులతో కలిపి మండల వ్యాప్తంగా గత పది రోజులుగా 360 కేసులు నమోదయ్యాయని వెల్లడించారు. ఇవాళ బీర్కూర్, నెమ్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 266 మందికి కొవిడ్ వ్యాక్సిన్ ఇచ్చినట్లు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా కొవిడ్ ఉద్ధృతి పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని వైద్యాధికారి ప్రజలకు సూచించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
-
మంత్రి కాకాణి అనుచరుడి రైస్ మిల్లులో మద్యం స్వాధీనం
-
జగనన్న నవ్వులు.. జనాలకు చుక్కలు
-
తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. కూలీ బిడ్డకు 993 మార్కులు
-
ఏ ముఖం పెట్టుకుని రాజధాని రైతులను సీఎం ఓట్లు అడుగుతారు
-
ఒకే బైక్పై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి