TS News: సదర్‌ ఉత్సవం సందర్భంగా అపశ్రుతి.. జనాలపైకి దూసుకొచ్చిన దున్న

సదర్‌ ఉత్సవం సందర్భంగా ఖైరతాబాద్‌లో అపశృతి చోటు చేసుకుంది. యాదవ సంఘం ఆధ్వర్యంలో ఖైరతాబాద్‌ కూడలిలో సదర్‌ ఉత్సవం ఏర్పాటు చేశారు

Updated : 08 Dec 2022 17:11 IST

హైదరాబాద్‌: సదర్‌ ఉత్సవం సందర్భంగా ఖైరతాబాద్‌లో అపశ్రుతి చోటు చేసుకుంది. యాదవ సంఘం ఆధ్వర్యంలో ఖైరతాబాద్‌ కూడలిలో సదర్‌ ఉత్సవం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తీసుకొచ్చిన దున్నపోతును ముస్తాబు చేస్తుండగా.. తాడు తెంపుకొని జనాలపైకి దూసుకొచ్చింది. దీంతో స్థానికులు భయంతో పరుగులు తీశారు. ఈఘటనలో నలుగురికి గాయాలు కాగా, పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. ఎట్టకేలకు నిర్వాహకులు దున్నపోతును శాంతింపజేసి చింతల్‌బస్తీ నుంచి ఖైరతాబాద్‌ సమ్మేళనానికి తీసుకొచ్చారు. ఈ ఘటనతో కాసేపు ఖైరతాబాద్‌లో ట్రాఫిక్‌ స్తంభించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు