రైల్వేఆస్తుల పరిరక్షణకు నింజా వాహనాలు
రైల్వే ఆస్తుల పరిరక్షణలో సాంకేతికత దిశగా ఆ శాఖ కీలక అడుగులు వేసింది. మానవ రహిత నింజా వాహనాలను రైల్వే శాఖ కొనుగోలు చేసింది.
మంబయి: రైల్వే ఆస్తుల పరిరక్షణలో సాంకేతికత దిశగా ఆ శాఖ కీలక అడుగులు వేసింది. మానవ రహిత నింజా వాహనాలను రైల్వే శాఖ కొనుగోలు చేసింది. డ్రోన్ల తరహాలో పని చేసే ఈ వాహనాల ద్వారా రైల్వేశాఖ స్టేషన్ పరిసరాలు, పట్టాలు, యార్డులు, వర్క్షాప్లపై నిఘా ఉంచనుంది. మొదట రెండు నింజా వాహనాలను కొనుగోలు చేసిన రైల్వేశాఖ వీటిని సెంట్రల్ రైల్వేలోని ముంబయి డివిజన్లో వినియోగించనుంది. ఈ వాహనాల ద్వారా రైల్వే ఆస్తులకు, ప్రయాణికులకు మరింత భద్రత కలగనుందని రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయల్ ట్విటర్లో తెలిపారు. రైల్వే భద్రత కోసం రైల్వే భద్రత దళం(ఆర్పీఎఫ్) ఇప్పటికే పలు డివిజన్లలో డ్రోన్లను వినియోగిస్తోంది. రాబోయే కాలంలో మరిన్ని కొనుగోలు చేసి రైల్వే భద్రతను మరింత పటిష్ఠం చేయాలని భావిస్తోంది. రైల్వే పరిసరాల్లో అసాంఘిక కార్యకలాపాల నివారణ, పరిశుభ్రత చర్యలను కూడా దీని ద్వారా పర్యవేక్షించాలని యోచిస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
దేశాల మధ్య డీఫ్ఫేక్ చిచ్చు.. ఫిలిప్పీన్స్-చైనాలో కలకలం సృష్టించిన వీడియో
-
ఐపీఎల్ స్ట్రీమింగ్ కేసు.. నటి తమన్నాకు సమన్లు
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
-
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ