Guinness World Records: ఆయనే అత్యంత పెద్ద వయస్కుడు..!
ప్రపంచంలోనే జీవించి ఉన్న అత్యంత పెద్ద వయస్కుడిగా ప్యూర్టో రికోకు చెందిన ఎమిలీయో ఫ్లోర్జ్ మార్క్వెజ్ గిన్నిస్ బుక్లో చోటు సంపాదించారు.
లండన్: ప్రపంచంలోనే జీవించి ఉన్న అత్యంత పెద్ద వయస్కుడిగా ప్యూర్టోరికోకు చెందిన ఎమిలీయో ఫ్లోర్జ్ మార్క్వెజ్ గిన్నిస్ బుక్లో చోటు సంపాదించారు. 112 ఏళ్ల 326 రోజుల వయసులో ఆయన ఈ ఘనత సాధించారు. ఈ మేరకు ‘గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్’ బుధవారం ప్రకటించింది. ఇంతకుముందు ఇదే రికార్డు రొమేనియాకు చెందిన డుమిత్రు కొమెస్కు పేరిట ఉండగా ఆయన 2020, జూన్ 27న మృతి చెందారు. అప్పటికి ఆయన వయసు 111 ఏళ్ల 219 రోజులు. ఆయన మరణం తర్వాత ఆ రికార్డును అధిగమించే వ్యక్తి కోసం వచ్చిన దరఖాస్తులను గిన్నిస్ అధికార ప్రతినిధులు పరిశీలించారు. ఈ క్రమంలో కొమెస్కు కన్నా మార్క్వెజ్ మూడు నెలల ముందు జన్మించినట్లు నిర్ధారణ చేసుకున్నారు. గిన్నిస్ బుక్లో అత్యంత పెద్ద వయస్కుడిగా ఆయన పేరును ఖరారు చేసి ధ్రవీకరణ పత్రం అందజేశారు. ఇలాంటి గొప్ప వ్యక్తుల పేర్లను ప్రపంచానికి పరిచయం చేయడాన్ని గౌరవంగా భావిస్తున్నట్లు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ చీఫ్ ఎడిటర్ క్రెయిగ్ గ్లెండే చెప్పుకొచ్చారు.
ప్యూర్టోరికోలోని కరోలినాలో 1908లో మార్క్వెజ్ జన్మించారు. తన తల్లిదండ్రులకు 11 మంది సంతానంలో ఆయన రెండోవారు. స్నేహతులకు ఆయన డాన్ మిలోగా సుపరిచితుడు. చిన్నతనంలో మూడేళ్లపాటు మాత్రమే పాశాలకు వెళ్లిన ఆయన అనంతరం తన కుటుంబానికి చెందిన చెరకు తోటలో పనిచేసేవారు. ఆయన భార్య ఆండ్రియా ప్రెజ్ డి ఫ్లోర్జ్ 2010లో.. 75 ఏళ్ల వయసులో మరణించారు. తన దీర్ఘాయువు వెనక ఉన్న రహస్యమేంటని అడగ్గా.. దయాగుణం కలిగి జీవించడమేనని ఆయన సమాధానమిచ్చినట్లు గిన్నిస్ ప్రతినిధులు తెలిపారు. ‘నా తండ్రి నన్ను ప్రేమతో పెంచడమే కాకుండా ప్రతి ఒక్కరినీ ప్రేమించాలని చెప్పాడు. అందరికీ మంచి చేయాలని నాతో పాటు నా తోబుట్టువులకు కూడా నేర్పించారు’ అని మార్క్వెజ్ చెప్పినట్లు వారు పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అవసరమైతే తప్ప బయటకు రావొద్దు: వాతావరణశాఖ
రాష్ట్రంలో 3 రోజుల పాటు కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
అష్టాదశ శక్తి పీఠక్షేత్రమైన శ్రీశైలం(Srisailam)లో కుంభోత్సవం వైభవంగా ప్రారంభమైంది. శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారి ఆలయాన్ని నిమ్మకాయలతో అలంకరించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగన్ మామయ్యా.. పాఠశాలల గోడు వినవయ్యా
నాడు- నేడుతో సర్కారు బడుల రూపు రేఖలు మార్చేశామని చెబుతున్నా.. చాలా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. -
మూడో దశ.. మాటే లేదు
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
అడిగే వారేరి... ఆపేవారేరి?
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
-
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?
-
ఎయిర్ గెశ్చర్స్తో రియల్మీ నుంచి బడ్జెట్ కొత్త ఫోన్
-
రివ్యూ: రత్నం.. విశాల్ నటించిన యాక్షన్ డ్రామా మెప్పించిందా?
-
డీజీసీఏ కొత్త రూల్.. విమాన టికెట్ల ధరలు తగ్గుతాయా?
-
‘వీవీప్యాట్ల’పై సుప్రీం తీర్పు.. విపక్షాలకు గట్టి చెంపదెబ్బ: మోదీ