టెలీస్కోప్లో అరుంధతి.. వరుడి వినూత్న ఆలోచన!
వివాహ వేడుకల్లో వరుడు వధువుకు అరుంధతి నక్షత్రం చూపించడం సహజం. చాలామందికి నక్షత్రం కనిపించకపోయినా చూసినట్లుగా ఫొటోలు దిగుతుంటారు. కానీ, ఆ వరుడు టెలీస్కోప్ను ఉపయోగించి వధువుకు నిజంగానే నక్షత్రాన్ని చూపించాడు. జగిత్యాల జిల్లా........
మేడిపల్లి (జగిత్యాల): వివాహ వేడుకల్లో వరుడు వధువుకు అరుంధతి నక్షత్రం చూపించడం సహజం. చాలామందికి నక్షత్రం కనిపించకపోయినా చూసినట్లుగా ఫొటోలు దిగుతుంటారు. కానీ, ఆ వరుడు టెలీస్కోప్ను ఉపయోగించి వధువుకు నిజంగానే నక్షత్రాన్ని చూపించాడు. జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం కల్వకోటలో ఆదివారం జరిగిన వివాహ వేడుకలో ఈ వినూత్న ఆలోచనకు బీజం పడింది. జాతీయస్థాయిలో భౌతిక శాస్త్రంలో 75వ ర్యాంకు పొందిన కడకుంట్ల అభయ్ రాజ్ దీనికి శ్రీకారం చుట్టారు.
కల్వకోటకు చెందిన గుండేటి శివానికి, రాయికల్కు చెందిన భౌతిక శాస్త్రం ప్రభుత్వ ఉపాధ్యాయుడు అభయ్ రాజ్తో వివాహం జరిగింది. అభయరాజ్ రాయికల్ మండలం రామారావు పల్లిలో ప్రభుత్వ ప్రధానోపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. భౌతికశాస్త్రంలో పలు సృజనాత్మక ఆవిష్కరణలకు ఆయన నాంది పలికారు. తన పాఠశాలలో విద్యార్థులతో భౌతిక శాస్త్రంలో పలు అంశాలను రూపొందించగా.. రెండుసార్లు దక్షిణ భారత స్థాయి సైన్స్ఫేర్లో చెన్నై, బెంగళూరులో బహుమతులు సాధించారు. ‘ఈనాడు’ హాయ్ బుజ్జి నిర్వహించిన వృక్ష మిత్ర పోటీల్లోనూ ఆయన విద్యార్థులు బహుమతులు పొందారు.
పెళ్లి వేడుకల్లో అరుంధతి నక్షత్రాన్ని చూపించినట్లు కేవలం తంతుగా కొనసాగుతుండగా.. అభయ్ రాజ్ మాత్రం టెలిస్కోప్ లెన్స్ సాయంతో నిజమైన అరుంధతి నక్షత్రాన్ని చూపించినట్లు చెప్పారు. చీకట్లో నక్షత్రాలు కనిపించడం సహజమని, కానీ మధ్యాహ్నం టెలిస్కోప్ సాయంతో అరుంధతి నక్షత్రం చూపించడం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ఈ వేడుకలో అరుంధతి నక్షత్రాన్ని వరుడు అభయ్ రాజ్ టెలిస్కోప్ ద్వారా చూపించిన విధానం అక్కడి వారిని ఆకట్టుకుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు: మధ్యప్రదేశ్ సీఎం
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!