చర్మం నుంచి స్వాబ్తో కొవిడ్ పరీక్షలు!
కేవలం చర్మం ద్వారా సేకరించిన నమూనాలతోనే కరోనా వైరస్ను గుర్తించవచ్చని బ్రిటన్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
బ్రిటన్ శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడి
లండన్: కొవిడ్-19 మహమ్మారి వ్యాప్తికి అడ్డుకట్టవేయడంలో వైరస్ను గుర్తించడమే ఎంతో కీలకం. మహమ్మారి విజృంభిస్తోన్న వేళ ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ నిర్ధారణ పరీక్షలకు భారీ స్థాయిలో చేపడుతున్నారు. ఇందుకోసం ఇప్పటివరకు ముక్కు, గొంతు ద్వారా నమూనాలు తీసుకునే స్వాబ్ ఆధారిత ఆర్టీ-పీసీఆర్ పరీక్షలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఈ నేపథ్యంలో శరీరంలోకి ఎలాంటి పరికరాలు చొప్పించకుండా కేవలం చర్మం ద్వారా సేకరించిన నమూనాలతోనే కరోనా వైరస్ను త్వరగా గుర్తించవచ్చని బ్రిటన్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
తేలికగా శాంపిళ్లను సేకరించి కొవిడ్ నిర్ధారణ చేయగలిగే పరీక్ష కోసం బ్రిటన్లోని యూనివర్సిటీ ఆఫ్ సర్రీ శాస్త్రవేత్తలు పరిశోధనలు జరిపారు. ఇందుకోసం చర్మం, ముఖం నుంచి వెలుబడే తైల గ్రంథుల (సెబమ్) శాంపిళ్లను తీసుకొని పరిశోధించారు. తద్వారా కేవలం వైరస్ నిర్ధారణే కాకుండా శరీరంపై వైరస్ ప్రభావం ఏ విధంగా ఉంటుందో తెలుసుకునేందుకు ప్రయత్నించారు. పరిశోధనలో భాగంగా, ఆసుపత్రిలో చేరిన 67మంది రోగుల నుంచి సెబమ్ శాంపిళ్లను సేకరించారు. వీరిలో 30మంది కొవిడ్ నిర్ధారణ అయినవారు కాగా, మరో 37 మందికి నెగిటివ్ వచ్చినవారు ఉన్నారు. తైల గ్రంథులు ఎక్కువగా ఉండే ముఖం, మెడ భాగం నుంచి శాంపిళ్లను సేకరించారు. అనంతరం లిక్విడ్ క్రోమాటోగ్రఫీ మాస్ స్పెక్ట్రోమెట్రీ విధానంలో ఈ శాంపిళ్లను విశ్లేషించారు. తద్వారా నెగెటివ్ వారికంటే పాజిటివ్ వచ్చిన వారిలో తక్కువ కొవ్వు పదార్థాలు (డైస్లిపిడెమియా) ఉన్నట్లు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అంతేకాకుండా ఎలాంటి చికిత్స, ఆరోగ్య పరిస్థితిని నియంత్రించినప్పుడు ఈ ఫలితాల్లో కచ్చితత్వం మరింత పెరిగినట్లు గుర్తించారు.
రానున్న రోజుల్లో కొవిడ్-19 వ్యాధుల నిర్ధారణ కోసం తేలికైన పద్ధతిని అనుసరించడానికి తమ అధ్యయనం దోహదం చేస్తుందని దీనికి నేతృత్వం వహించిన యూనివర్సిటీ సర్రీ ప్రొఫెసర్ మెలానీ బెయిలీ పేర్కొన్నారు. కొవిడ్-19 మానవ జీవక్రియపై ప్రభావం చూపిస్తుందని ఇప్పటికే తేలిందని, తాజాగా ఆ జాబితాలో చర్మం కూడా చేరినట్లు సహ పరిశోధకులు మ్యాట్ స్పిక్ అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా గుర్తించగలిగే కొవిడ్ లక్షణాల్లో దీన్ని కూడా చేర్చుకునే అవకాశం ఉందన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం.. -
శిరోముండనం కేసు.. హైకోర్టులో విచారణ వాయిదా
శిరోముండనం కేసులో విశాఖపట్నం కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై హైకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. -
జగన్పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీ పిటిషన్పై తీర్పు వాయిదా
సీఎం జగన్పై రాయి దాడి కేసులో నిందితుడు సతీష్ కస్టడీ పిటిషన్పై తీర్పును విజయవాడ కోర్టు వాయిదా వేసింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం.. -
కొండగట్టు క్షేత్రంలో ఘనంగా హనుమాన్ జయంతి
ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న ఆలయంలో చిన్న హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం.. -
పాటలతో రీల్స్.. మాటలతో మీమ్స్
లోక్సభ ఎన్నికల్లో భాగంగా ఇప్పటికే నామపత్రాల ప్రక్రియ జోరందుకొంది. ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు క్షేత్రస్థాయిలో తిరుగుతూ ప్రచారం చేస్తూనే సామాజిక మాధ్యమాల్లోనూ చురుగ్గా ఉంటున్నారు. -
భగభగ మండే
విపరీతమైన ఎండలకు మిర్యాలగూడ ప్రాంతం మాడిపోతోంది. సోమవారం మండల పరిధిలోని టీక్యాతండాలో రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రత 45 డిగ్రీలు నమోదైంది. -
పట్టాలెక్కని ప్రతిపాదనలు
ఉమ్మడి జిల్లాలో రైల్వే శాఖాపరంగా అభివృద్ధికి అడుగులు పడాలని ప్రయాణికులు ఆశిస్తున్నారు. -
ప్రతి ఓటును ఒడిసిపట్టేలా..
సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాలని భారాస.. పాతికేళ్ల తర్వాత అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని కాంగ్రెస్... ఈసారి సత్తా చాటాలని భాజపా.. పక్కా వ్యూహంతో ముందుకు కదులుతున్నాయి. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (23/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
ధోనీని అంత కోపంగా నేనెప్పుడూ చూడలేదు: సురేశ్ రైనా
-
నిర్మాతల నుంచి పవన్కల్యాణ్ తీసుకున్న అప్పు ఎంతో తెలుసా?
-
దీదీకి ఆ ధైర్యం లేదు: అమిత్ షా
-
ఆడిషన్ అంటూ పది మందిని ముద్దు పెట్టుకోమన్నారు: స్టార్ హీరోయిన్
-
గుంపులో స్మార్ట్ఫోన్లు కొట్టేస్తే.. చిన్న ట్రిక్తో పట్టేశాడు..!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM