వధువు-వరుడు జంటగా జంప్‌

తాళి కట్టే వేళ పెళ్లికూతురు వెళ్లిపోయిందని చాలాసార్లు విన్నాం. పెళ్లి పీటల మీద నుంచి వరుడు కనిపించకుండా పోయిన

Updated : 19 Jul 2021 20:29 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: తాళి కట్టే వేళ పెళ్లికూతురు వెళ్లిపోయిందని చాలాసార్లు విన్నాం. పెళ్లి పీటల మీద నుంచి వరుడు కనిపించకుండా పోయిన సన్నివేశం ఎన్నోసార్లు చూశాం. కానీ, చిత్రంగా పెళ్లి పీటల నుంచి వధువు-వరుడు ఇద్దరు కలిసి పారిపోయిన సంఘటన ఒడిశాలో చోటు చేసుకుంది. ఇంతకీ వాళ్లిద్దరికి వచ్చిన కష్టం ఏంటంటే.. కొవిడ్‌-19 నిబంధనలు పాటించడం లేదనీ, అతిథులు ఎక్కువగా వచ్చారని పోలీసులు ఆ పెళ్లిలో చేసిన హడావుడినే. పోలీసులు ప్రశ్నలతో హింసిస్తారనీ, కేసు నమోదు చేస్తారనే భయంతోనే పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇలా వెళ్లిపోయారని బంధువులు చెబుతున్నారు. ఈ చిత్రమైన సంఘటన బాలాసోర్‌ జిల్లాలోని చాపులియా చౌక్‌లో చోటు చేసుకుంది. కరోనా వ్యాప్తి చెందకుండా ఒడిశా పోలీసులు పెళ్లికి యాభై మందికి మంచి హాజరు కాకూడదనే నిబంధనను కఠినంగా అమలు చేస్తున్నారు. ఈ పెళ్లికి దాదాపు 200 మందికిపైగా అతిథులు వచ్చినట్టు సమాచారం. ముహుర్తానికి ముందే కనిపించకుండా పోయిన ఆ పడుచు జంట ఆచూకీ ఇప్పటికీ తెలియరావడం లేదట.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని