Agriculture: ‘కృత్రిమ మేధ’తో రైతుల ఆదాయాన్ని పెంచాలి
వివిధ మార్గాల ద్వారా వ్యవసాయ రంగంలో చిన్న, సన్నకారు రైతుల ఆదాయాన్ని పెంచాల్సిన అవసరం ఉందని ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు ఆకాంక్షించారు. బిహార్ తూర్పు చంపారన్ జిల్లాలోని డా.రాజేంద్రప్రసాద్ కేంద్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఆదివారం నిర్వహించిన స్నాతకోత్సవానికి...
ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు
పట్నా: వివిధ మార్గాల ద్వారా వ్యవసాయ రంగంలో చిన్న, సన్నకారు రైతుల ఆదాయాన్ని పెంచాల్సిన అవసరం ఉందని ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు ఆకాంక్షించారు. బిహార్ తూర్పు చంపారన్ జిల్లాలోని డా.రాజేంద్రప్రసాద్ కేంద్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఆదివారం నిర్వహించిన స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన ఉప రాష్ట్రపతి ఈ మేరకు ప్రసంగించారు. దేశంలో ఫుడ్ ప్రాసెసింగ్ రంగానికి చాలా అవకాశాలు ఉన్నాయని, రైతులను ఈ దిశగా ప్రోత్సహించాలని వ్యవసాయ విశ్వవిద్యాలయాలకు పిలుపునిచ్చారు. కరోనా సమయంలో చాలా మంది ప్రజలు నగరాలను వదిలి తమ గ్రామాలకు తిరిగి వచ్చారని, ఈ క్రమంలో వ్యవసాయ ఆధారిత పరిశ్రమలను ప్రోత్సహించడం ద్వారా వారికి ఇక్కడే ఉపాధి లభిస్తుందని పేర్కొన్నారు.
కొవిడ్ సవాళ్లు ఎదురైనప్పటికీ..
వ్యవసాయ రంగంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎక్కువగా ఉపయోగించుకోవాలని ఉప రాష్ట్రపతి సూచించారు. ‘సాగులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) వినియోగంతో అభివృద్ధి చెందిన దేశాలు ఇప్పటికే అనేక ప్రయోజనాలు పొందుతున్నాయి. వ్యవసాయ ఆదాయాన్ని మెరుగుపరిచేందుకు భారత్ కూడా ఈ తరహా టెక్నాలజీలను వినియోగించాలి’ అని అన్నారు. కొవిడ్ సవాళ్లు ఎదురైనప్పటికీ రికార్డు స్థాయిలో ఆహార ధాన్యాల ఉత్పత్తి చేయడాన్ని ప్రశంసిస్తూ.. రైతులకు దేశం చాలా రుణపడి ఉందన్నారు. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, గవర్నర్ ఫాగు చౌహాన్, ఉప ముఖ్యమంత్రి రేణుదేవి తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఉప రాష్ట్రపతి.. ఇక్కడి నలంద విశ్వవిద్యాలయంలో ఆరో ధర్మ- దమ్మ అంతర్జాతీయ సదస్సును ప్రారంభించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
కాళేశ్వరం ఎత్తిపోతల్లోని బ్యారేజీలపై ప్రజల నుంచి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఫిర్యాదులు, నివేదనలు కోరింది. -
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
సీఎం జగన్కు బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుందని వైఎస్ సునీత అన్నారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
హైదరాబాద్ - బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
ఐపీఎల్ 17వ సీజన్లో భాగంగా ఉప్పల్ వేదికగా గురువారం రాత్రి 7.30 గంటలకు సన్రైజర్స్ హైదరాబాద్, బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. -
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ
సీఎం జగన్ (YS Jagan)కు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ బహిరంగ లేఖ రాశారు. వివేకా హత్య (Viveka Murder Case)కు కారకులైన వారికి మళ్లీ ఎంపీగా అవకాశం ఇవ్వడంతో పాటు రక్షణ కల్పిస్తున్నారంటూ ఆమె నిలదీశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
యూపీఎస్సీ - 2025 పరీక్షల క్యాలెండర్ విడుదల.. ‘సివిల్స్’ పరీక్షలు ఎప్పుడంటే?
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
-
అమెరికా నివేదికకు విలువ లేదు.. ‘మానవ హక్కుల ఉల్లంఘన’ అంశంపై భారత్ సీరియస్
-
ఆన్లైన్లో తెగ కొనేస్తున్నారు.. తొలిసారి ₹1 లక్ష కోట్లు దాటిన క్రెడిట్ కార్డ్ వ్యయం
-
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ