పాత్రికేయులకు లోకేశ్ బీమా ధీమా

కరోనా వేళ మంగళగిరి నియోజకవర్గం పాత్రికేయులకు తెదేపా నేత నారా లోకేశ్...

Updated : 20 Jul 2020 02:16 IST

అమరావతి: కరోనా వేళ మంగళగిరి నియోజకవర్గం పాత్రికేయులకు తెదేపా నేత నారా లోకేశ్ బీమా ధీమా కల్పించారు. మంగళగిరి పరిధిలోని 62 మంది పాత్రికేయులకు లోకేశ్‌ బీమా చేయించారు. సహజ మరణానికి రూ.10 లక్షలు, ప్రమాదమైతే రూ.20లక్షలు, కొవిడ్‌ మరణాలకూ బీమా వర్తింపజేసేలా ప్రీమియం చెల్లించినట్లు లోకేశ్‌ తెలిపారు. కరోనా మహమ్మారి వ్యాప్తి నివారణలో వైకాపా ప్రభుత్వం విఫలమైందని లోకేశ్‌ విమర్శించారు. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నా సరైన చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని