Jobs: ఈ ఏడాదిలో ఉద్యోగంమారుతాం..!

అన్ని రంగాలపై కరోనా మహమ్మారి తీవ్ర ప్రభావం చూపినా.. ఉద్యోగావకాశాలు సానుకూలంగా ఉంటున్నాయి. ఈ నేపథ్యంలోనే చాలా మంది ఉద్యోగులు ఈ ఏడాది ఉద్యోగం మారాలని భావిస్తున్నారట. ప్రముఖ ఆన్‌లైన్‌ ప్రొఫెషనల్‌ నెట్‌వర్క్‌ పోర్టల్‌ ‘లింక్డ్‌ఇన్‌’ సంస్థ చేసిన సర్వేలో ఈ విషయం

Published : 20 Jan 2022 02:08 IST

లింక్డ్‌ఇన్‌ సర్వేలో వెల్లడించిన 82 శాతం ఉద్యోగులు

ఇంటర్నెట్‌ డెస్క్‌: అన్ని రంగాలపై కరోనా మహమ్మారి తీవ్ర ప్రభావం చూపినా.. ఉద్యోగావకాశాలు సానుకూలంగా ఉంటున్నాయి. ఈ నేపథ్యంలోనే చాలా మంది ఉద్యోగులు ఈ ఏడాది ఉద్యోగం మారాలని భావిస్తున్నారట. ప్రముఖ ఆన్‌లైన్‌ ప్రొఫెషనల్‌ నెట్‌వర్క్‌ పోర్టల్‌ ‘లింక్డ్‌ఇన్‌’ సంస్థ చేసిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. దేశవ్యాప్తంగా వివిధ రంగాలకు చెందిన వేలమంది ఉద్యోగులపై ఈ సంస్థ సర్వే నిర్వహించింది. 

సర్వేలో పాల్గొన్న వారిలో 82శాతం మంది ఉద్యోగం మారేందుకు ప్రయత్నిస్తున్నారు. కొత్త ఉద్యోగాలు అన్వేషించే వారిలో ఫ్రెషర్స్‌ లేదా ఒక ఏడాది అనుభవం ఉన్నవారే 94శాతం ఉన్నారని నివేదిక చెబుతోంది. ఇక జెడ్‌ జనరేషన్‌ (1990-2000 సంవత్సరాల మధ్య పుట్టిన వ్యక్తులు) ఉద్యోగుల్లో 87శాతం మంది ఉద్యోగం మారాలని యోచిస్తున్నారు. ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగం మారడానికి గల కారణాల విషయానికొస్తే.. వృత్తి-వ్యక్తిగత జీవితాన్ని సమన్వయం చేసుకోలేపోతున్నామని 23 శాతం మంది, వేతనం సరిపోవట్లేదని 28శాతం మంది, మెరుగైన కెరీర్‌ కోసం ఉద్యోగం మారుతున్నామని 23 శాతం మంది వెల్లడించారు. కొత్త ఉద్యోగాల అన్వేషణలో అనుకూల పనివేళలకే మొదటి ప్రాధాన్యమిస్తామని ఉద్యోగులు చెబుతున్నారు. 

భవిష్యత్తులో ఉద్యోగ లభ్యతపై చాలా మంది ఉద్యోగులు ఆశాభావంతో ఉన్నారు. 86శాతం మంది ఉద్యోగులు తమ వృత్తిపరమైన నెట్‌వర్క్‌పై, ఉద్యోగ పొందే సామర్థ్యంపై నమ్మకంతో ఉన్నారు. కానీ, 33శాతం మంది కరోనా మహమ్మారి తమలో ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసిందని వాపోయారు.

రాజీనామాలు ఆపే మార్గాలు

ఉద్యోగులు రాజీనామా చేయకుండా ఉండాలంటే ప్రస్తుత యాజమాన్యాలు మూడు అంశాలపై దృష్టి సారించాల్సి ఉందట. వేతనాలు పెంచడం, ఉద్యోగులు చేసే పనికి గుర్తింపునివ్వడం, వృత్తి-వ్యక్తిగత జీవితాన్ని సమన్వయం చేసుకునే వీలు కల్పించడం.. ఈ మూడు అంశాల్లో ఉద్యోగులకు అనుకూలంగా మార్పులు చేస్తే రాజీనామాలు చేసే అవకాశాలు తగ్గుతాయని నివేదికలో తేలింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని