‘కదలకుండా 2 గంటలు’: పాపులరైన యువకుడు
సోషల్ మీడియాలో యూట్యూబ్ ఒకటి. ఎంతో మంది ఇందులో పాపులర్ కావడం కోసం ప్రయత్నాలు చేస్తుంటారు. నెటిజన్లకు ఆకట్టుకోవడం కోసం తమ సృజనాత్మకత వెలికితీసి, నానా కష్టాలు పడి వీడియోలు చేసి పెడుతుంటారు. కానీ ఇండొనేషియాకి చెందిన ఓ యువకుడు
ఇంటర్నెట్ డెస్క్: సోషల్ మీడియాలో యూట్యూబ్ ఒకటి. ఎంతో మంది ఇందులో పాపులర్ కావడం కోసం ప్రయత్నాలు చేస్తుంటారు. నెటిజన్లను ఆకట్టుకోవడం కోసం తమ సృజనాత్మకత వెలికితీసి, నానా కష్టాలు పడి వీడియోలు చేసి పెడుతుంటారు. కానీ ఇండొనేషియాకి చెందిన ఓ యువకుడు మాత్రం ఏం చేయకుండా కేవలం కెమెరా ముందు కూర్చొని బాగా పాపులర్ అయ్యాడు. ఇప్పుడు అక్కడి సోషల్మీడియాలో ఆ యువకుడి వీడియోలు, మీమ్స్ హల్చల్ చేస్తున్నాయి. అతడిలా వీడియోలు చేసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారు.
చాలా మందిలాగే ఇండోనేషియాకు చెందిన మహ్మద్ దిదిత్ ఓ యూట్యూబర్. యువత కోసం ప్రత్యేకమైన వీడియోలు చేస్తుంటాడు. అయితే ఇటీవల ఏం చేయాలో తెలియక 2 గంటల పాటు కంప్యూటర్ కెమెరా ముందు ఖాళీగా కూర్చొని వీడియో రికార్డ్ చేశాడు. రికార్డింగ్ సమయంలో ముఖంలో ఎలాంటి హావభావాలు లేకుండా కనీసం కదలకుండా కూర్చున్నాడు. అలా 2 గంటలు ఏం చేయకుండా తీసిన వీడియోను ‘ 2 అవర్స్ ఆఫ్ డూయింగ్ నథింగ్’ పేరుతో యూట్యూబ్లో అప్లోడ్ చేశాడు. అంతే.. ఆ వీడియో తెగ పాపులర్ అయింది. అప్లోడ్ చేసిన కొన్నిరోజుల్లోనే 20లక్షల వ్యూస్ వచ్చాయి. అతడి వీడియోపై పేరడీలు, మీమ్స్ వచ్చాయి. దీనిని ఓ ఛాలెంజ్లా తీసుకొని మరికొందరు మహ్మద్లా 2 గంటలు ఏం చేయకుండా ఖాళీగా కూర్చొని వీడియో రికార్డ్ చేస్తున్నారు. అంతే కాదు.. ఆ రెండు గంటల్లో అతడు ఎన్నిసార్లు కనురెప్పలు కొట్టాడో లెక్కపెట్టి కామెంట్లు చేస్తున్నారు. నిజానికి ఈ వీడియోని మహ్మద్ కేవలం 5 నుంచి 10 నిమిషాలపాటే చేయాలనుకున్నాడట. కానీ అలా కూర్చొడం బాగుందనిపించి.. రెండు గంటలు కొనసాగించాడు. స్థానిక మీడియా ఈ వీడియో గురించి మహ్మద్ను ఇంటర్వ్యూలు చేస్తున్నాయట. అలా మహ్మద్ ఉన్నఫలంగా ఫేమస్ అయిపోయాడు. తమషాగా చేసినా ఇప్పుడు వచ్చిన ఈ పాపులారిటీకి మహ్మద్ సంతోషంలో మునిగితేలుతున్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారాస అధినేత కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం
నల్గొండ జిల్లా వేములపల్లి వద్ద భారాస అధినేత కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం జరిగింది. -
అవనిగడ్డలో వైకాపా ర్యాలీ.. బాణసంచా పడి తెదేపా కార్యకర్త ఇల్లు దగ్ధం
కృష్ణా జిల్లా అవనిగడ్డలో వైకాపా అభ్యర్థి సింహాద్రి రమేశ్ బాబు నామినేషన్ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో అపశ్రుతి చోటు చేసుకుంది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఆ 80 కుటుంబాలకు రక్షణ కల్పించండి.. పోలీసులకు హైకోర్టు ఆదేశం
పల్నాడు జిల్లా ఆత్మకూరు గ్రామంలో 50, జంగమేశ్వరపాడు గ్రామంలో 30 కుటుంబాలకు రక్షణ కల్పించాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది. -
62వేల మంది వాలంటీర్లు రాజీనామా చేశారు.. కోర్టుకు తెలిపిన ఈసీ న్యాయవాది
ఏపీలో వాలంటీర్ల రాజీనామాల పిటిషన్పై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. -
జగన్పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి
సీఎం జగన్పై రాయి దాడి కేసులో నిందితుడు సతీష్ను కస్టడీకి ఇచ్చేందుకు కోర్టు అనుమతించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (24/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
వెరైటీ డ్రెస్సులో అదాశర్మ పోజులు.. మెహందీతో మేఘా ఆకాశ్
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
భారాస అధినేత కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం
-
మూడోసారి అంతరిక్షంలోకి.. సిద్ధమవుతోన్న సునీతా విలియమ్స్
-
Sunetra Pawar: ఎన్నికల వేళ.. రూ.25 వేల కోట్ల స్కామ్ కేసులో సునేత్ర పవార్కు క్లీన్ చిట్