Sood - KTR : సోనూనే సూపర్ హీరో: కేటీఆర్
కరోనా సంక్షోభ సమయంలో కష్టాల్లో ఉన్నవారికి సాయం చేస్తూ సినీనటుడు సోనూసూద్ రియల్ హీరోగా నిలుస్తున్నారు. తాజాగా ఆయన్ను తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ సైతం సూపర్ హీరో అంటూ కొనియాడారు
మంత్రి ట్వీట్పై స్పందించిన నటుడు
హైదరాబాద్: కరోనా సంక్షోభ సమయంలో కష్టాల్లో ఉన్నవారికి సాయం చేస్తూ సినీనటుడు సోనూసూద్ రియల్ హీరోగా నిలుస్తున్నారు. తాజాగా ఆయన్ను తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ సైతం సూపర్ హీరో అంటూ కొనియాడారు. తాము అడగ్గానే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను సమకూర్చి సాయం చేసిన కేటీఆర్ను నిజమైన సూపర్ హీరో అంటూ నందకిశోర్ అనే వ్యక్తి ట్విటర్లో ప్రశంసించగా.. దానికి మంత్రి స్పందించారు. ఈ సందర్భంగా కేటీఆర్ చేసిన ట్వీట్ ఆసక్తికరంగా మారింది. ఎన్నికైన ప్రజాప్రతినిధిగా తన వంతు బాధ్యతను నిర్వర్తించినట్టు కేటీఆర్ తెలిపారు. సోనూసూద్ను సూపర్ హీరోగా పిలవడం సరైనదంటూ పేర్కొన్నారు. అంతేకాకుండా తన ట్వీట్కు సోనూసూద్ని ట్యాగ్ చేశారు. ఆపదలో ఉన్నవాళ్లకు ‘మీరూ సాయం చేయండి బ్రదర్’ అంటూ ఆ వ్యక్తికి కేటీఆర్ సూచించారు.
తెలంగాణ నా రెండో ఇల్లు
కేటీఆర్ ట్వీట్పై సోనూసూద్ స్పందించారు. తన గురించి చేసిన వ్యాఖ్యలకు కృతజ్ఞతలు తెలిపారు. కానీ తెలంగాణకు ఎంతో చేస్తున్న మీరే నిజమైన హీరో అంటూ కేటీఆర్ను సోనూ కొనియాడారు. మీ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి చెందుతోందని పేర్కొన్నారు. తెలంగాణను తన రెండో ఇల్లుగా భావిస్తానని, అక్కడి ప్రజలు ఎన్నో ఏళ్లుగా తనపై ప్రేమను చూపుతున్నారంటూ ట్వీట్ చేశారు.
మరోవైపు, కరోనాతో నెలకొన్న క్లిష్ట పరిస్థితుల వల్ల అనేకమంది ప్రజలు సాయం కోసం సామాజిక మాధ్యమాలను ఓ మంచి వేదికగా వినియోగించుకుంటున్నారు. ఔషధాలు, ఆస్పత్రుల్లో పడకలు, ఆక్సిజన్, వ్యాక్సిన్లు.. ఇలా ఏ అవసరం ఉన్నా ట్వీట్లు చేస్తూ వాటికి పలు రంగాల ప్రముఖులను ట్యాగ్ చేస్తున్నారు. దీంతో వారు సకాలంలో స్పందించి తగిన సాయం అందిస్తుండటం ద్వారా ఎంతోమందికి ప్రాణదాతలుగా నిలుస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
గరుడ ప్రసాద వితరణ.. చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్
చిలుకూరు బాలాజీ ఆలయం వైపు వెళ్లే మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. 10 కి.మీ పైగా వాహనాలు నిలిచిపోయాయి. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగనన్నా.. దాహం తీర్చవయ్యా!
వేసవి కాలం వచ్చింది. ఎండలు మండిపోతున్నాయి. నీటి ఎద్దడి ఏర్పడుతోంది. అధికారులు గుక్కెడు నీరు కూడా ఇవ్వలేకపోతున్నారు. దాహం తీర్చుకోవడానికి ప్రజలు నానాఇబ్బందులు పడుతున్నారు. ఇదీ పట్టణంలోని పలు ప్రాంతాల్లోని పరిస్థితి. -
పేదల పాలిట.. వి‘నాసి’కారే..!
రాష్ట్ర, చీప్ లిక్కర్కు కేంద్రంగా మారిపోయింది. ‘జే’బ్రాండ్ పేరుతో తీసుకొచ్చిన నాసిరకం మద్యం ప్రజల ప్రాణాలు హరిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పించినా ఈ ప్రభుత్వం లెక్క చేసిన దాఖలాలు లేవు. -
వినియోగదారులకు రెట్టింపు షాక్
ఐదేళ్ల పాలనలో ఇప్పటికే పలుమార్లు విద్యుత్తు ఛార్జీలు పెంచేసి సామాన్యులపై మోయలేని భారం వేసిన వైకాపా ప్రభుత్వం.. తాజాగా కొత్త మార్గంలో బాదుడు మొదలెట్టింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
మమ్ముట్టితో విభేదాలు.. స్పందించిన ‘ది వారియర్’ దర్శకుడు
-
ట్రెక్కింగ్ చేస్తూ జారిపడి.. స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి
-
మీ ప్రాంతంలో బ్రాడ్బ్యాండ్ సేవలందించే సంస్థలేవో ఎలా తెలుసుకోవాలి?
-
మహబూబ్నగర్ ఎంపీ అభ్యర్థిగా వంశీచంద్రెడ్డి నామినేషన్.. ర్యాలీలో పాల్గొన్న సీఎం రేవంత్
-
త్వరలో ఫీల్డింగ్కు వస్తా.. 40 ఓవర్లూ మైదానంలో ఉంటా: సూర్య
-
వైకాపా అడ్డుపడుతోంది.. మీ ఇళ్ల వద్దకు రాలేకపోతే మన్నించండి: సునీత