ఆటలో గెలవలేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు
జపాన్ ప్రజలు గేమ్స్ ప్రియులు. చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ గేమ్స్ ఆడటానికి ఎక్కువ ఇష్టపడతారు. అందుకే మొబైల్ గేమ్స్, పీసీ గేమ్స్తోపాటు ప్రత్యేకంగా ఆర్కేడ్ గేమ్స్ సెంటర్లు దేశవ్యాప్తంగా దర్శనమిస్తుంటాయి. కొన్ని గేమ్స్ తెలివితో ఆడాల్సి ఉంటుంది. మరికొన్ని గేమ్స్కు నైపుణ్యం అవసరం. ఇటీవల
(ఫొటో: ఒగాటన్ ట్విటర్)
ఇంటర్నెట్ డెస్క్: జపాన్ ప్రజలు గేమ్స్ ప్రియులు. చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ గేమ్స్ ఆడటానికి ఎక్కువ ఇష్టపడతారు. అందుకే మొబైల్ గేమ్స్, పీసీ గేమ్స్తోపాటు ప్రత్యేకంగా ఆర్కేడ్ గేమ్స్ సెంటర్లు దేశవ్యాప్తంగా దర్శనమిస్తుంటాయి. కొన్ని గేమ్స్ తెలివితో ఆడాల్సి ఉంటుంది. మరికొన్ని గేమ్స్కు నైపుణ్యం అవసరం. ఇటీవల జపాన్కి చెందిన ఓ యువకుడు గేమ్స్ సెంటర్కి వెళ్లి ఒక ఆట ఆడాడు. ఎన్ని సార్లు ప్రయత్నించినా గెలవకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎట్టకేలకు గేమ్స్ సెంటర్ యాజమాన్యం దిగొచ్చి సులువుగా గెలుపొందే విధంగా ఆటను మార్చడం విశేషం.
ఒగాటన్ అనే ఇరవై ఏళ్ల కుర్రాడు ఇటీవల టోక్యోలోని ఓ ఆర్కేడ్ గేమ్ సెంటర్కు వెళ్లాడు. అక్కడున్న క్రేన్ గేమ్ (అద్దంలోపల ఉండే వస్తువుల్ని క్రేన్ సాయంతో బయటకు తీసుకురాగలిగితే ఆ వస్తువును గెలుచుకున్నట్లు) ఆడాడు. 200 సార్లు ప్రయత్నించినా అతడికి ఒక్క వస్తువు కూడా దక్కలేదు. దీంతో ఆగ్రహించిన ఒగాటన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఆటలో అక్రమం జరుగుతోందని, ఎవరూ విజేతలుగా నిలవలేకపోతున్నారని ఆరోపించాడు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకొని విచారించారు. గేమ్స్ సెంటర్ సిబ్బంది కూడా ఆ ఆటను ఆడి చూపించారు. వాళ్లు కూడా 300 సార్లు ప్రయత్నించినా గెలవలేకపోయారు. దీంతో సమస్య ఎక్కడుందో యాజమాన్యం గుర్తించింది. అద్దంలోపల వస్తువులు పెట్టిన స్థానాలు సరిగా లేవని తెలుసుకొని మార్పులు చేశారు. దీంతో ఒగాటన్ సులువుగా ఆట గెలిచి వస్తువును దక్కించుకున్నాడు. ఇదంతా దగ్గరుండి పర్యవేక్షించిన పోలీసులు యాజమాన్యంపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అయితే, ఆ గేమ్ సెంటర్ యాజమాన్యం మాత్రం ఓ ప్రకటన విడుదల చేసింది. ‘‘అన్ని క్రేన్ గేమ్స్ కస్టమర్ల నైపుణ్యం, అదృష్టం మీద ఆధారపడి ఉంటాయి. ఇవి కేవలం సరాదా కోసమే. డబ్బులు పెట్టినంత మాత్రాన కచ్చితంగా బహుమతి రావాలని లేదు. ఈ పరిస్థితి అర్థం చేసుకొని గేమ్స్ ఆడాలని కోరుతున్నాం’’అని పేర్కొంది. ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలను ఒగాటన్ తన ట్విటర్లో పెట్టడంతో నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విశాఖ-బెంగళూరు మధ్య ప్రత్యేక రైలు
వేసవిలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని విశాఖ- బెంగళూరు మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు వాల్తేర్ సీనియర్ డీసీఎం ఎ.కె.త్రిపాఠి తెలిపారు. -
పెళ్లి ఘట్టం.. క్యూఆర్ కోడ్లో నిక్ష్లిప్తం
రాజమహేంద్రవరానికి చెందిన అలికాని సత్యశివకుమార్(శివస్వామి), దుర్గాభవానీలు వినూత్న ప్రయత్నం చేశారు. -
మీమ్స్ తో ప్రచారం.. యువ ఓటర్లకు గాలం
ఎన్నికల్లో గెలవాలంటే అనర్గళంగా ప్రసంగిస్తూ.. అన్నివర్గాల ఓటర్లను ప్రసన్నం చేసుకోవడం.. గెలిస్తే ఏం చేస్తామో చెప్పడం.. ప్రత్యర్థి పార్టీని విమర్శించడం ఒకప్పటి ప్రచార శైలి.. -
ఓటాస్త్రం.. స్వీయచిత్రమే సాక్ష్యం
ఓరుగల్లు నగరంలో ఓటింగ్ శాతం పెంచేందుకు వరంగల్ కలెక్టరేట్ ఆవరణలో సెల్ఫీ పాయింట్ ఏర్పాటు చేశారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (20/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు
తాజా వార్తలు (Latest News)
-
శరద్ పవార్ వైపు దూసుకొచ్చిన మైక్రోఫోన్!
-
నిషేధమెక్కడ.. ‘నిషా’దమే.. రక్త మాంసాలతో జగన్ వ్యాపారం
-
పనసపండు గుర్తు ఎక్కడ?.. గందరగోళానికి గురైన ఓటర్లు
-
బాబు సీఎం అయ్యే వరకు పాదరక్షలు ధరించనని..!
-
బస్సులు జగన్ సభకు.. కష్టాలు ప్రయాణికులకు
-
వైకాపా నేతల సిఫార్సులతో పోస్టు.. మహిళా ఉద్యోగినులతో వెకిలి చేష్టలు