AP News: ఉద్యోగులకు డీఏ బకాయిలు, పీఆర్సీపై ఉత్తర్వులు విడుదల
ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. ఉద్యోగులకు డీఏ బకాయిలు, వేతన సవరణ సంఘం(పీఆర్పీ)కి సంబంధించి ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. 2019 జులై 1నుంచి 5 బకాయిల చెల్లింపునకు ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ బకాయిల్లో 2022 జనవరి వేతనంతో ఇచ్చే డీఏ కలిసి ఉందని ఆర్థిక శాఖ వెల్లడించింది.
అమరావతి: ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ బకాయిలు, వేతన సవరణ సంఘం(పీఆర్సీ)కి సంబంధించి ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. 2019 జులై 1నుంచి 5 బకాయిల చెల్లింపునకు గాను ప్రభుత్వం ఈ ఉత్తర్వులను జారీ చేసింది. ఈ బకాయిల్లో 2022 జనవరి వేతనంతో ఇచ్చే డీఏ కలిసి ఉందని ఆర్థిక శాఖ వెల్లడించింది. డీఏ బకాయిలను సాధారణ ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల్లో ఈ మొత్తాన్ని జమ చేయనున్నట్లు అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. డీఏ బకాయిలను సీపీఎస్ ఉద్యోగుల పీఆర్ఏఎన్ ఖాతాల్లో జమ చేయనున్నారు.
పీఆర్సీ విషయమై... 2018 జులై నుంచి, ఆర్థిక ప్రయోజనాలను 2020 ఏప్రిల్ 1 నుంచి చెల్లించున్నట్లు, డీఏ బకాయిలను 2022 జనవరి నుంచి నగదు చెల్లించనున్నట్టు ఆర్థిక శాఖ పేర్కొంది.
మాస్టర్ స్కేల్, ఫిట్మెంట్ అమలుకు గాను ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మూల వేతనంపై 23 శాతంగా ఫిట్ మెంట్ నిర్ధరించినట్టు ఆర్థిక శాఖ వెల్లడించింది. ఈ ఫిట్మెంట్ ను 2022 నుంచి అమలు చేసేందుకు నిర్ణయించింది.
అంతేకాకుండా ఉద్యోగులకు కేటగిరీల వారీగా హెచ్ఆర్ఏ చెల్లింపులు చేయనున్నారు. 50 లక్షల జనాభా దాటిన పట్టణాల్లో నివాసం ఉండే ఉద్యోగులకు బేసిక్లో 24 శాతం హెచ్ఆర్ఏ ఇవ్వనున్నారు. 5నుంచి 50లక్షల జనాభా ఉన్న పట్టణాల్లో ఉద్యోగులకు బేసిక్లో 16 శాతం హెచ్ఆర్ఏ అందుతుంది. 5లక్షలలోపు జనాభా ఉన్న పట్టణాల్లోని ఉద్యోగులకు బేసిక్లో 8 శాతం ఇవ్వనున్నారు.
ప్రభుత్వ తాజా ఉత్తర్వుల ప్రకారం రాష్ట్రంలోని ఉద్యోగులు 16శాతం కేటగిరీలోకి రానున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం.. -
కొండగట్టు క్షేత్రంలో ఘనంగా హనుమాన్ జయంతి
ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న ఆలయంలో చిన్న హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం.. -
పాటలతో రీల్స్.. మాటలతో మీమ్స్
లోక్సభ ఎన్నికల్లో భాగంగా ఇప్పటికే నామపత్రాల ప్రక్రియ జోరందుకొంది. ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు క్షేత్రస్థాయిలో తిరుగుతూ ప్రచారం చేస్తూనే సామాజిక మాధ్యమాల్లోనూ చురుగ్గా ఉంటున్నారు. -
భగభగ మండే
విపరీతమైన ఎండలకు మిర్యాలగూడ ప్రాంతం మాడిపోతోంది. సోమవారం మండల పరిధిలోని టీక్యాతండాలో రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రత 45 డిగ్రీలు నమోదైంది. -
పట్టాలెక్కని ప్రతిపాదనలు
ఉమ్మడి జిల్లాలో రైల్వే శాఖాపరంగా అభివృద్ధికి అడుగులు పడాలని ప్రయాణికులు ఆశిస్తున్నారు. -
ప్రతి ఓటును ఒడిసిపట్టేలా..
సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాలని భారాస.. పాతికేళ్ల తర్వాత అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని కాంగ్రెస్... ఈసారి సత్తా చాటాలని భాజపా.. పక్కా వ్యూహంతో ముందుకు కదులుతున్నాయి. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (23/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
తెలుగులో ‘నాయట్టు’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
దుబాయ్ వరదలకు ముందు.. తర్వాత: శాటిలైట్ చిత్రాల్లో ఇలా
-
ఇన్స్టంట్ ఇ-పాన్ కావాలా..? ఉచితంగా పొందండిలా..
-
వన్ప్లస్ నార్డ్ సీఈ3 ఫోన్పై డిస్కౌంట్.. ఈ సబ్స్క్రిప్షన్లూ ఉచితం!
-
ఆయన్ని చూసి ఆశ్చర్యపోయాను.. అల్లు అర్జున్పై ‘కేజీఎఫ్’ నటుడు ప్రశంసలు..