శవంతో జర్నీ.. పరిగెడతావా? ఫైన్ కడతావా?
‘శవంతో ప్రయాణం’.. ‘దొరికావా గోతులు తీయి’.. ‘పరిగెడతావా.. ఫైన్ కడతావా?’ ఆ మధ్య కరోనా నేపథ్యంలో పేరడీగా వచ్చిన సినిమా పేర్లు గుర్తొస్తున్నాయి కదూ. కానీ.....
ప్రతీకాత్మక చిత్రం
ఇంటర్నెట్డెస్క్: ‘శవంతో ప్రయాణం’.. ‘దొరికావా గోతులు తీయి’.. ‘పరిగెడతావా.. ఫైన్ కడతావా?’ ఆ మధ్య కరోనా నేపథ్యంలో పేరడీగా వచ్చిన సినిమా పేర్లు గుర్తొస్తున్నాయి కదూ. కానీ, ఇవి సినిమా పేర్లు కాదు. కొవిడ్ నేపథ్యంలో రూపుదిద్దుకున్న కొత్త శిక్షలు. ఈ కొత్త కాన్సెప్ట్లకు రూపకర్తలు ఇండోనేసియాలోని స్థానిక అధికారులు. ‘ఏమవుతుందిలే’ అన్న నిర్లక్ష్యం ప్రదర్శించే వారిపై ఇలా తమదైన పద్ధతిలో వినూత్న శిక్షలు విధిస్తూ కొవిడ్ నియంత్రణకు కృషి చేస్తున్నారు.
మాస్కులు ధరించకుండా దొరికిన వ్యక్తులపై తూర్పు జావాలోని అధికారులు ‘శవంతో ప్రయాణం’ అనే కొత్త కాన్సెప్ట్ను ప్రవేశపెట్టారు. ఎవరైనా మాస్కు ధరించకుంటే వారిని కొవిడ్-19తో మరణించిన వ్యక్తుల వ్యాన్లో ఎక్కించి ప్రయాణం చేయిస్తారు. ఇటీవల ఓ కూరగాయల మార్కెట్లో నిబంధనలు పాటించని 50 మందికి ఈ విధంగా శిక్షలు విధించారట. తూర్పు జావాలోని అధికారులైతే మాస్కులు ధరించని వారికి శవాలకు గోతులు తవ్వే పని చెబుతున్నారు. ‘నిల్చుంటావా? పరిగెడతావా?’ ఎవరైనా మాస్కు ధరించకుండా, భౌతిక దూరం పాటించకుండా చిక్కితే వారిని అక్కడి అధికారులు అడిగే ప్రశ్నలివీ. నిల్చోవడమే కదా మాస్టారు ఈజీనే కదా అనుకునేరు. అరగంట సేపు మండుటెండలో నిల్చోవాలి. లేదంటే ఓ 800 మీటర్లు పరుగెత్తి వచ్చి ఓ 10 పుషప్స్ తీయిస్తారు.
మాస్కు ధరించకపోతే వారితో పార్కుల్లో గడ్డి పీకిస్తున్నారు లహోక్సేయుమావె ప్రాంతానికి చెందిన అధికారులు. వారికి విధించిన శిక్ష పూర్తయ్యాక ఉచితంగా మాస్కులు పంపిణీ చేస్తారు. ఒకసారి శిక్ష పడిన వారు మళ్లీ మళ్లీ తప్పు చేయకుండా వారి వివరాలను నమోదు చేసుకుంటున్నారు. తూర్పు జకర్తాలోనైతే గంటసేపు కాలువ శుభ్రం చేయిస్తున్నారు.. లేదంటే జరిమానా కట్టమంటున్నారు. అంతే కాదు.. ఎవరైనా బైక్పై వెళ్లేటప్పుడు మాస్కు ధరించకుండా కనిపిస్తే వారిని దెయ్యం ముసుగులో ఉన్న అధికారులు ఆపి భయపెట్టడమే కాదు.. మాస్కు పెట్టుకోకుంటే జరిగే అనర్థాలను వివరించి మాస్కు అందిస్తున్నారు. ఇలా విధిస్తున్న ‘అపరిచిత శిక్షలు’ కొంతమేర సత్ఫలితాలను ఇస్తున్నాయని చెబుతున్నారు అక్కడి అధికారులు. ప్రస్తుతం ఆ దేశంలో కరోనా కేసులు దాదాపు 2.20 లక్షలు చేరగా.. ఇప్పటి వరకు సుమారు 9 వేల మంది మరణించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కుప్పంలో చంద్రబాబు జన్మదిన వేడుకలు.. కేక్ కట్ చేసిన నారా భువనేశ్వరి
చిత్తూరు జిల్లా కుప్పంలో తెదేపా అధినేత చంద్రబాబు జన్మదిన వేడుకలను ఆయన సతీమణి నారా భువనేశ్వరి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
హైదరాబాద్లో ఉరుములు, మెరుపులతో వర్షం
నగరంలోని పలుచోట్ల శనివారం ఉదయం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. -
విశాఖ-బెంగళూరు మధ్య ప్రత్యేక రైలు
వేసవిలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని విశాఖ- బెంగళూరు మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు వాల్తేర్ సీనియర్ డీసీఎం ఎ.కె.త్రిపాఠి తెలిపారు. -
పెళ్లి ఘట్టం.. క్యూఆర్ కోడ్లో నిక్ష్లిప్తం
రాజమహేంద్రవరానికి చెందిన అలికాని సత్యశివకుమార్(శివస్వామి), దుర్గాభవానీలు వినూత్న ప్రయత్నం చేశారు. -
మీమ్స్ తో ప్రచారం.. యువ ఓటర్లకు గాలం
ఎన్నికల్లో గెలవాలంటే అనర్గళంగా ప్రసంగిస్తూ.. అన్నివర్గాల ఓటర్లను ప్రసన్నం చేసుకోవడం.. గెలిస్తే ఏం చేస్తామో చెప్పడం.. ప్రత్యర్థి పార్టీని విమర్శించడం ఒకప్పటి ప్రచార శైలి.. -
ఓటాస్త్రం.. స్వీయచిత్రమే సాక్ష్యం
ఓరుగల్లు నగరంలో ఓటింగ్ శాతం పెంచేందుకు వరంగల్ కలెక్టరేట్ ఆవరణలో సెల్ఫీ పాయింట్ ఏర్పాటు చేశారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (20/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు
తాజా వార్తలు (Latest News)
-
‘మా చిత్రాన్ని మరో ‘అన్బే శివం’ చేయొద్దు’: విజయ్ ఆంటోనీ వైరల్ పోస్ట్
-
నా భార్య ఆహారంలో టాయిలెట్ క్లీనర్ కలుపుతున్నారు: ఇమ్రాన్ ఖాన్ ఆరోపణలు
-
చెరో రూ. 12 లక్షలు కట్టండి.. కెప్టెన్లకు జరిమానా
-
స్మిత ఇంట సీతారాముల కల్యాణం.. నాని సందడి
-
కుప్పంలో చంద్రబాబు జన్మదిన వేడుకలు.. కేక్ కట్ చేసిన నారా భువనేశ్వరి
-
భారత్లో ఎలాన్ మస్క్ పర్యటన వాయిదా