త్రివర్ణ శోభితంగా ముస్తాబైన ఎర్రకోట
74వ స్వాతంత్ర్య వేడుకలకు ఎర్రకోట సిద్ధమైంది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో గతంలో ఎన్నడూ లేనంత నిరాడంబరంగా అతి కొద్ది మంది అతిథుల నడుమ ఈ సంబురాలు జరగనున్నాయి. కేంద్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చాక ప్రధాని నరేంద్ర మోదీ రెండోసారి ఎర్రకోటపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయబోతున్నారు.
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు సర్వం సిద్ధం
శనివారం ఉదయం 7.30 గంటలకు జెండా ఆవిష్కరించనున్న ప్రధాని
దిల్లీ: 74వ స్వాతంత్ర్య వేడుకలకు ఎర్రకోట సిద్ధమైంది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో గతంలో ఎన్నడూ లేనంత నిరాడంబరంగా అతి కొద్ది మంది అతిథుల నడుమ ఈ సంబరాలు జరగనున్నాయి. ఈ సారి 22 మంది అధికారులతోనే గౌరవ వందనం స్వీకరించబోతున్నారు. దిల్లీ పోలీసులు ఈసారి కేవలం 350 మందే పాల్గొనబోతున్నారు. గతంలో భారీ ఎత్తున పోలీసు బలగాలు పెద్దఎత్తున మోహరించి ఉండేవి. కానీ ఈసారి కరోనా వ్యాప్తి నేపథ్యంలో పూర్తిస్థాయిలో 350 మంది పోలీసులను కూడా 14రోజుల క్వారంటైన్ తరువాత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా పాల్గొనేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. కరోనాను జయించిన పోలీసులు, ప్రభుత్వ అధికారులను ప్రత్యేకంగా ఆహ్వానించబోతున్నారు. అందరూ కూర్చునేందుకు భౌతిక దూరంతో కుర్చీలు ఏర్పాటు చేశారు. ప్రతి ఏడాది వివిధ పాఠశాలల నుంచి విద్యార్థులు హాజరయ్యేవారు. కానీ ఈసారి విద్యార్థులు హాజరు కావద్దంటూ అధికారులు ఆదేశించారు.
ఎర్రకోట ప్రాంగణం ఇప్పటికే త్రివర్ణ శోభితాన్ని సంతరించుకుంది. ప్రధాని మోదీ మువ్వన్నెల జెండాను ఎగురవేసిన తరువాత ప్రసంగించేందుకు బుల్లెట్ప్రూఫ్ గ్లాస్క్లోజర్, అతిథులు కూర్చునేందుకు కుర్చీలు ఏర్పాటు చేశారు. కరోనా నేపథ్యంలో స్వాతంత్ర్య వేడుకల అతిథుల జాబితాను 150కి కుదించినట్లు తెలుస్తోంది.
ఈసారి 5వేల మందే!
ఎర్రకోటలో ఏర్పాట్లన్నీ పూర్తి కాగా గురువారం తెల్లవారుజామున చిరుజల్లుల మధ్యలోనే త్రివిధ దళాలు రిహార్సల్స్ నిర్వహించాయి. ఏటా 30వేల మందికి పైగా హాజరయ్యే ఎర్రకోటలో ఈసారి 5వేల మందితోనే కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. కుర్చీల మధ్య రెండు గజాల దూరం ఉండనుంది. మాస్కులు ధరిస్తేనే లోపలికి అనుమతించడంతో పాటు భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. ప్రధాని నరేంద్రమోదీ శనివారం ఉదయం 7.21 గంటలకు ఎర్రకోట చేరుకొని 7.30 గంటలకు జెండా ఆవిష్కరించనున్నారు. ఆ తరువాత ఎర్రకోట నుంచి జాతినుద్దేశించి ప్రసంగిస్తారు. కరోనా ఉద్ధృతి, సవాళ్లు, ఆత్మనిర్బర్ భారత్ సహా మరిన్ని అంశాలను ప్రస్తావించే అవకాశం ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
గరుడ ప్రసాద వితరణ.. చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్
చిలుకూరు బాలాజీ ఆలయం వైపు వెళ్లే మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. 10 కి.మీ పైగా వాహనాలు నిలిచిపోయాయి. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగనన్నా.. దాహం తీర్చవయ్యా!
వేసవి కాలం వచ్చింది. ఎండలు మండిపోతున్నాయి. నీటి ఎద్దడి ఏర్పడుతోంది. అధికారులు గుక్కెడు నీరు కూడా ఇవ్వలేకపోతున్నారు. దాహం తీర్చుకోవడానికి ప్రజలు నానాఇబ్బందులు పడుతున్నారు. ఇదీ పట్టణంలోని పలు ప్రాంతాల్లోని పరిస్థితి. -
పేదల పాలిట.. వి‘నాసి’కారే..!
రాష్ట్ర, చీప్ లిక్కర్కు కేంద్రంగా మారిపోయింది. ‘జే’బ్రాండ్ పేరుతో తీసుకొచ్చిన నాసిరకం మద్యం ప్రజల ప్రాణాలు హరిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పించినా ఈ ప్రభుత్వం లెక్క చేసిన దాఖలాలు లేవు. -
వినియోగదారులకు రెట్టింపు షాక్
ఐదేళ్ల పాలనలో ఇప్పటికే పలుమార్లు విద్యుత్తు ఛార్జీలు పెంచేసి సామాన్యులపై మోయలేని భారం వేసిన వైకాపా ప్రభుత్వం.. తాజాగా కొత్త మార్గంలో బాదుడు మొదలెట్టింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
మీ ప్రాంతంలో బ్రాడ్బ్యాండ్ సేవలందించే సంస్థలేవో ఎలా తెలుసుకోవాలి?
-
మహబూబ్నగర్ ఎంపీ అభ్యర్థిగా వంశీచంద్రెడ్డి నామినేషన్.. ర్యాలీలో పాల్గొన్న సీఎం రేవంత్
-
త్వరలో ఫీల్డింగ్కు వస్తా.. 40 ఓవర్లూ మైదానంలో ఉంటా: సూర్య
-
వైకాపా అడ్డుపడుతోంది.. మీ ఇళ్ల వద్దకు రాలేకపోతే మన్నించండి: సునీత
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
దుబాయ్ నుంచి ఆలస్యంగా పునియా, సుజీత్.. ఒలింపిక్ క్వాలిఫయర్స్ మిస్