ఈ బర్గర్ ధర రూ.4.42 లక్షలు..!
సాధారణంగా బర్గర్ తినాలనిపిస్తే ఏ బేకరీకో వెళ్లి దర్జాగా ఆర్డరిస్తాం. బేకరీ స్థాయిని అనుసరించి బిల్లు మహా అయితే.. రూ.50 నుంచి 200 వరకు అవుతుంది.
ఇంటర్నెట్ డెస్క్: సాధారణంగా బర్గర్ తినాలనిపిస్తే ఏ బేకరీకో వెళ్లి దర్జాగా ఆర్డరిస్తాం. బేకరీ స్థాయిని అనుసరించి బిల్లు మహా అయితే.. రూ.50 నుంచి 200 వరకు అవుతుంది. కానీ ఈ బర్గర్ తినాలంటే జేబులు ఒకసారి తడుముకోవాల్సిందే. ఎందుకంటే.. ఈ ఒక్క బర్గర్ ధర అక్షరాలా రూ.4.42 లక్షలు. ప్రపంచంలో ఇదే అత్యంత ఖరీదైన బర్గర్గా దీని తయారీదారులు చెప్పుకొంటున్నారు. ఈ బర్గర్ను నెదర్లాండ్స్లోని డే డాల్టన్ రెస్టారెంట్లో పని చేస్తున్నరాబర్ట్ జాన్ డీ వీన్ అనే చెఫ్ తయారు చేశారు. దీనికి ‘గోల్డెన్ బాయ్’గా నామకరణం చేసి తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్టు చేశారు. అంతే.. ఆహార ప్రియులంతా దీనివైపు లొట్టలేసుకుంటూ చూస్తున్నారు. ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్గా మారింది.
ఈ బర్గర్ తయారీలో ఖరీదైన బెలూగా కేవియర్, పెద్ద సముద్రపు పీత, కుంకుమ పువ్వు, వాగ్యు బీఫ్, పంది మాంసం, అరుదైన రకం తెల్లటి పుట్టగొడుగులు, చీజ్ వినియోగించినట్టు తయారీదారులు చెప్పుకొచ్చారు. వీటితో పాటు ప్రపంచంలో ఖరీదైన సివెట్ కాఫీ గింజలతో తయారు చేసిన బార్బెక్యూ సాస్ను ఇందులో ఉపయోగించారు. ఈ బర్గర్లో ఖరీదైన డామ్ పెరిగ్నాన్ షాంపేన్తో తయారు చేసిన బన్ను వాడారు. ఆ బన్లపై బంగారు ఆకులతో అలంకరించారు. తయారీలో ఇన్ని ఖరీదైన పదార్థాలు వాడినందుకే ఈ బర్గర్ ధర రూ.లక్షల్లో ఉంది. దీనిని విక్రయించగా వచ్చిన సొమ్మును ఏదైనా ఎన్జీవోకు దానంగా ఇవ్వాలనుకుంటున్నట్లు వీన్ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో రెండు కెమెరాలతో నిఘా: సీఈవో మీనా
సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో రెండు కెమెరాలతో పర్యవేక్షణ ఉంటుందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేశ్ కుమార్ మీనా తెలిపారు. -
ఆన్లైన్లోనూ నామినేషన్ వేయొచ్చు: వికాస్ రాజ్
లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఆన్లైన్లోనూ నామినేషన్ దాఖలు చేయవచ్చని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ తెలిపారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఏపీ, తెలంగాణకు సాగర్ నీటి విడుదలపై కేఆర్ఎంబీ ఉత్తర్వులు
వేసవిలో తాగునీటి అవసరాల కోసం కృష్ణానది యాజమాన్య బోర్డు నీటి విడుదల ఉత్తర్వులు జారీ చేసింది. -
గరిష్ఠ ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం: వాతావరణ శాఖ
రాష్ట్రంలో గురు, శుక్రవారాల్లో కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ వడగాల్పులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. -
భద్రాచలంలో కనులపండువగా శ్రీరామ మహా పట్టాభిషేకం
శ్రీరామ మహా పట్టాభిషేక మహోత్సవ వేడుకతో గురువారం భద్రగిరి దివ్యక్షేత్రం పులకించింది. వేద మంత్రోచ్ఛరణల మధ్య సింహాసనాన్ని అధిష్ఠించిన రామచంద్రుడు భక్తకోటికి నేనున్నానంటూ కొండంత అభయమిచ్చాడు. -
జగన్పై రాయి దాడి కేసు.. ఆ ఆరుగురి వివరాలు తెలపాలంటూ కోర్టులో పిటిషన్
సీఎం జగన్పై రాయి దాడి వ్యవహారంపై విజయవాడ కోర్టులో పిటిషన్ దాఖలైంది. పోలీసుల అదుపులో ఉన్న ఆరుగురి వివరాలు తెలపాలంటూ న్యాయవాది సలీం ఈ పిటిషన్ వేశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
102 స్థానాలు.. 16 కోట్ల మంది ఓటర్లు.. తొలిదశ పోలింగ్కు సర్వం సిద్ధం
-
రుణం కోసం.. మృతదేహాన్ని బ్యాంకుకు తీసుకొచ్చి..!
-
అమ్మ చనిపోయారు.. నేను పోటీ చేయలేను: ‘హిమాచల్’ డిప్యూటీ సీఎం కుమార్తె
-
జగన్పై రాయిదాడి కేసు.. నిందితుడికి 14 రోజుల రిమాండ్
-
లోక్సభ ఎన్నికలు.. ద్రవిడనాట ‘భాజపా’ బోణీ కొట్టేనా?
-
రాష్ట్రంలో లిక్కర్ మాఫియా రాజ్యమేలుతోంది: వైఎస్ షర్మిల