Doctor: కొవిడ్ వార్డు నా జీవితాన్ని మార్చేసింది
కరోనా విపత్తు తన జీవితానికి సరిపడా పాఠాలు నేర్పిందని.. కొవిడ్ వార్డులో పనిచేయడం జీవితం పట్ల తన దృక్పథాన్ని మార్చిందని యువ వైద్యుడు పేర్కొంటున్నారు....
అనుభవాలు పంచుకున్న ఓ యువ వైద్యుడు
ఇంటర్నెట్ డెస్క్: కరోనా కాలంలో వైద్యులు తీరిక లేని పని చేస్తున్నారు. నిద్రాహారాలు మాని రాత్రింబవళ్లు రోగులకు సేవ చేస్తున్నారు. ఎంతోమందికి ప్రాణం పోస్తున్నారు. కొవిడ్ వార్డులో పనిచేసిన ఓ వైద్యుడు తన మనోభావాలను పంచుకున్నారు. ఈ విపత్తు జీవితానికి సరిపడా పాఠాలు నేర్పిందని.. కొవిడ్ వార్డులో పనిచేయడం జీవితం పట్ల తన దృక్పథాన్ని మార్చిందని యువ వైద్యుడు పేర్కొంటున్నారు. గతంలో కంటే ప్రజలకు ఇప్పుడు ఎక్కువ విలువ ఇస్తున్నానని తెలిపారు. కుటుంబం, బంధువులు, స్నేహితులతో ఆనందంగా గడిపే క్షణాలను ఇలా కరోనా వార్డులోనే గడుపున్నానని.. ఒత్తిడికి గురయ్యానని, శక్తి కోల్పోయానని ఆవేదన చెందారు. అయినా కరోనా అంతం వరకు ఇలాగే పోరాడుతానన్నారు.
‘పని భారంతో ఎన్నో పూటలు భోజనానికి దూరమయ్యాను. కచ్చితమైన షెడ్యూల్ లేకపోవడం నా లైఫ్స్టైల్లో అనేక మార్పులు తీసుకొచ్చింది. వ్యాధితోనే కాదు.. వైద్య సదుపాయాలు లేక ఓ రోగి ఎలా విలవిల్లాడుతాడో చూసి నా కళ్లు తెరుచుకున్నాయి. ఎంతోమంది చావుబతుకులతో కొట్టుమిట్టాడుతున్నారు. అయినవారిని కోల్పోయి ఎన్నో కుటుంబాలు ఛిన్నాభిన్నమయ్యాయి. ఎందరో పిల్లలు తమ తల్లిదండ్రులను కోల్పోయారు. మరెందరో తల్లిదండ్రులకు గర్భశోకం మిగులుతోంది. నా ఆధీనంలోని రోగి మృతిచెందితే నా కుటుంబసభ్యులే మృతిచెందినట్లు బాధ కలిగేది. ఎవరి పరిస్థితైనా విషమించితే అతడి వద్దకు వెళ్లి నవ్వించేందుకు ప్రయత్నించేవాడిని. ఆ కొద్ది క్షణాలైనా అతడిని ఆనందంగా ఉంచాలి అని అనిపించేంది’ అని ఆ వైద్యుడు పలు విషయాలు పంచుకున్నారు.
‘కుటుంబసభ్యులకు అనుమతి లేకపోవడంతో.. ఒంటరిగానే బాధితులు కొవిడ్ వార్డులో చికిత్స పొందుతుంటారు. వారిని అలా చూడటం బాధగా ఉండేది. కొందరు నన్ను కౌగిలించుకొని వారి బాధలు, కష్టాలు, కోరికలు చెప్పేవారు. వారిలో కొందరిని కాపాడలేనేమోనని ఎంతో మదనపడేవాడిని. ఇవన్నీ ఒక ఎత్తయితే మృతుల కుటుంబాలకు చేదు వార్త చెప్పడం అత్యంత కష్టమైన పని. ఆ క్షణంలో వారి బాధను చూసి తట్టుకోలేకపోయేవాడిని.’ అని పేర్కొన్నారు.
మహమ్మారి నుంచి రోగుల ప్రాణాలు కాపాడేందుకు వైద్యులు తమ శక్తిమేర కృషి చేస్తున్నారని అన్నారు. టీకాలు అందుబాటులోకి రావడం.. వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుండటంతో మహమ్మారికి ముగింపు పలుకుతామనే ఆశిస్తున్నానన్నారు. నిరంతరం పనిచేస్తూ అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నానని.. బాధితులను కాపాడేందుకు వాటిని లెక్కచేయనని గర్వంగా తెలిపారు. ప్రతి వైద్యుడు, ఇతర ఆరోగ్య సిబ్బంది ఇదే తరహా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని.. మహమ్మారికి ముగింపు పలికేవరకు ఇలాగే కష్టపడాలని వారికి సూచించారు. ప్రతి ఒక్కరు మాస్కులు ధరిస్తూ, భౌతిక దూరం పాటించాలని, సానుకూల దృక్పథంతో ఉండాలని ప్రజలకు సూచించారు. తమను ప్రేమించేవారితో ఎక్కువ సమయం గడపాలన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
కాళేశ్వరం ఎత్తిపోతల్లోని బ్యారేజీలపై ప్రజల నుంచి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఫిర్యాదులు, నివేదనలు కోరింది. -
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
సీఎం జగన్కు బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుందని వైఎస్ సునీత అన్నారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
హైదరాబాద్ - బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
ఐపీఎల్ 17వ సీజన్లో భాగంగా ఉప్పల్ వేదికగా గురువారం రాత్రి 7.30 గంటలకు సన్రైజర్స్ హైదరాబాద్, బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. -
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ
సీఎం జగన్ (YS Jagan)కు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ బహిరంగ లేఖ రాశారు. వివేకా హత్య (Viveka Murder Case)కు కారకులైన వారికి మళ్లీ ఎంపీగా అవకాశం ఇవ్వడంతో పాటు రక్షణ కల్పిస్తున్నారంటూ ఆమె నిలదీశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
-
అమెరికా నివేదికకు విలువ లేదు.. ‘మానవ హక్కుల ఉల్లంఘన’ అంశంపై భారత్ సీరియస్
-
ఆన్లైన్లో తెగ కొనేస్తున్నారు.. తొలిసారి ₹1 లక్ష కోట్లు దాటిన క్రెడిట్ కార్డ్ వ్యయం
-
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ
-
నా వ్యాఖ్యలను అపార్థం చేసుకోవడంతోనే సమస్య: అంబటి రాయుడు