ICMR: 20 ఏళ్లలో రెట్టింపైన నాడీ సమస్యలు
భారత్లో 1990-2019 మధ్య అసాంక్రమిక, గాయాల సంబంధ నాడీ సమస్యలు (నాన్ కమ్యూనికబుల్ న్యూరాలజికల్ డిజార్డర్స్)
ఇందులో అత్యధికం పక్షవాతమే
అధిక రక్తపోటు, మధుమేహం, వాయు కాలుష్యమే కారణం!
ఐసీఎంఆర్ అధ్యయనంలో వెల్లడి
ఈనాడు, దిల్లీ: భారత్లో 1990-2019 మధ్య అసాంక్రమిక, గాయాల సంబంధ నాడీ సమస్యలు (నాన్ కమ్యూనికబుల్ న్యూరాలజికల్ డిజార్డర్స్) రెట్టింపయినట్టు ఐసీఎంఆర్ అధ్యయనంలో తేలింది! ఈ అంశంపై ఐసీఎంఆర్, కేంద్ర వైద్యపరిశోధన సంస్థ, పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా, ఐహెచ్ఎంఈలు సంయుక్తంగా పరిశోధనపత్రం రూపొందించాయి. దీన్ని ‘లాన్సెట్’ పత్రిక బుధవారం ప్రచురించింది. ప్రజల వయసు పెరగడంతో పాటు... అధిక రక్తపోటు, వాయు కాలుష్యం, ఆహార లోపాలు, తీవ్ర మధుమేహం, స్థూలకాయం వంటివి ఈ నాడీ సమస్యలు పెరగడానికి ప్రధాన కారణమని అధ్యయనకర్తలు పేర్కొన్నారు. ఐదేళ్లలోపు పిల్లల్లో సంక్రమణ వ్యాధుల సమస్యలు అధికంగా ఉండగా, అసంక్రమణ వాధ్యులు మాత్రం అన్ని వయస్సుల వారిలో ఉన్నట్టు తేల్చారు.
• 2019లో పక్షవాతం కారణంగా 6.99 లక్షల మంది మరణించగా, మొత్తం మరణాల్లో దీని వాటా 7.4%. నాడీ సంబంధ సమస్యల్లో అసంక్రమణ వ్యాధులు 82.8%, సంక్రమణ వ్యాధులు 11.2%, గాయాల వాటా 6%.
• 2019లో వెలుగుచూసిన నాడీ సమస్యల్లో 37.9% కేసులకు పక్షవాతమే కారణం. తలనొప్పి 17.5%, మూర్ఛ 11.3%, సెరెబ్రల్ పాల్సీ 5.7, అల్జిమర్స్ 4.6%, సెంట్రల్ నెర్వస్ కేన్సర్ 2.2%, పార్కిన్సన్స్ 1.8%, మోటార్ నెర్వస్ డిసీజ్ 0.1%, ఇతర నాడీ సంబంధ సమస్యలు 1.3% మేర ఉన్నాయి. అంటువ్యాధుల్లో ఎన్సెఫిలిటిస్ 5.3%, మెనింజైటిస్ 4.8%, టెటనస్ 1.1% ఉన్నాయి.
• గాయాల్లో తలకు సంబంధించినవి 4.1%, వెన్నుపూసకు తగిలినవి 1.9% మేర ఉన్నట్లు అధ్యయనం పేర్కొంది. జీవితకాలంపై ప్రభావంచూపే వ్యాధుల్లో అసాంక్రమిక నాడీ సంబంధ సమస్యల వాటా 1990లో 4% ఉండగా, 2020 నాటికి అది 8.2 శాతానికి పెరిగింది. గాయాల కారణంగా తలెత్తే సమస్యల నిష్పత్తి 0.2% నుంచి 0.6%కి చేరింది. ఇదే సమయంలో అంటువ్యాధుల నిష్పత్తి 4.1% నుంచి 1.1%కి తగ్గింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
హైదరాబాద్ శివారులో వర్ష బీభత్సం.. శ్రీశైలం హైవేపై ట్రాఫిక్ జామ్
నగర శివారులో శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి శ్రీశైలం జాతీయ రహదారిపై ట్రాఫిక్ జామ్ అయింది. -
ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై షర్మిలకు ఈసీ నోటీసులు
ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు ఎన్నికల కమిషన్ నోటీసులు జారీ చేసింది. -
వైకాపా ప్రచార రథం ఢీకొని బాలుడి మృతి విషాదకరం: చంద్రబాబు
వైకాపా ప్రచారరథం ఢీకొని బాలుడు మృతి చెందిన ఘటన అత్యంత విషాదకరమని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
దిల్లీ మద్యం స్కామ్.. సీబీఐ కేసులోనూ అప్రూవర్గా మారిన శరత్ చంద్రారెడ్డి
దిల్లీ మద్యం కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. గతంలో ఈడీ కేసులో అప్రూవర్గా మారిన నిందితుడు శరత్ చంద్రారెడ్డి, సీబీఐ నమోదు చేసిన కేసులోనూ అప్రూవర్గా మారారు. -
సిద్దిపేటలో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్పై హైకోర్టు స్టే
సిద్దిపేటలో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్పై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. భారాస ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి సమావేశంలో పాల్గొన్నారని ఆరోపిస్తూ ఇటీవల వారిపై సస్పెన్షన్ వేటు వేశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
చిలుకూరు ఆలయంలో గరుడ ప్రసాదం పంపిణీ నిలిపివేశాం: రంగరాజన్
హైదరాబాద్ శివారులోని చిలుకూరు బాలాజీ ఆలయంలో గరుడ ప్రసాదం పంపిణీ నిలిపివేసినట్టు ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ తెలిపారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగనన్నా.. దాహం తీర్చవయ్యా!
వేసవి కాలం వచ్చింది. ఎండలు మండిపోతున్నాయి. నీటి ఎద్దడి ఏర్పడుతోంది. అధికారులు గుక్కెడు నీరు కూడా ఇవ్వలేకపోతున్నారు. దాహం తీర్చుకోవడానికి ప్రజలు నానాఇబ్బందులు పడుతున్నారు. ఇదీ పట్టణంలోని పలు ప్రాంతాల్లోని పరిస్థితి. -
పేదల పాలిట.. వి‘నాసి’కారే..!
రాష్ట్ర, చీప్ లిక్కర్కు కేంద్రంగా మారిపోయింది. ‘జే’బ్రాండ్ పేరుతో తీసుకొచ్చిన నాసిరకం మద్యం ప్రజల ప్రాణాలు హరిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పించినా ఈ ప్రభుత్వం లెక్క చేసిన దాఖలాలు లేవు. -
వినియోగదారులకు రెట్టింపు షాక్
ఐదేళ్ల పాలనలో ఇప్పటికే పలుమార్లు విద్యుత్తు ఛార్జీలు పెంచేసి సామాన్యులపై మోయలేని భారం వేసిన వైకాపా ప్రభుత్వం.. తాజాగా కొత్త మార్గంలో బాదుడు మొదలెట్టింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం
-
హైదరాబాద్ శివారులో వర్ష బీభత్సం.. శ్రీశైలం హైవేపై ట్రాఫిక్ జామ్
-
‘విక్రమార్కుడు’, ‘బజరంగీ భాయిజాన్’ సీక్వెల్స్ అప్డేట్.. ఎంతవరకు వచ్చాయంటే!
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై షర్మిలకు ఈసీ నోటీసులు