అందరూ ఉన్నా... ఆ నలుగురేరన్నా!
సుమారు 1,500 మంది గ్రామస్థులు, బంధువులూ, స్నేహితులూ ఎక్కువే. కానీ ఆయన కడ చూపునకు ఎవరూ రాలేదు. అంత్యక్రియలు చేసేందుకు ...
ఉంగుటూరు, న్యూస్టుడే: సుమారు 1,500 మంది గ్రామస్థులు, బంధువులూ, స్నేహితులూ ఎక్కువే. కానీ ఆయన కడ చూపునకు ఎవరూ రాలేదు. అంత్యక్రియలు చేసేందుకు ఆ నలుగురూ లేకుండా పోయారు. కృష్ణాజిల్లా ఉంగుటూరు మండలం నాగవరపాడుకు చెందిన వ్యక్తి (55) కిరాణా దుకాణం నడుపుతున్నారు. ఆయనకు మధుమేహం, అల్సర్ ఉన్నాయి. ఇటీవల జ్వరం రావడంతో విజయవాడ ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లారు. శుక్రవారం ఇంటికి వచ్చారు. శనివారం మరణించారు. ఆయనకు భార్య, ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. ఖననం చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. కొందరు పెద్దలు జేసీబీ మాట్లాడినా... వచ్చేందుకు డ్రైవర్ నిరాకరించారు. మృతుని సోదరుడు, మరో సోదరుని ఇద్దరు పిల్లలు... ఉంగుటూరు నుంచి మనుషుల్ని తీసుకొచ్చి గుంత తవ్వించారు. ఆ తర్వాత ముగ్గురూ కలిసి ఆటోలో మృతదేహాన్ని తీసుకువెళ్లి అంత్యక్రియలు చేశారు. కరోనాకు భయపడి... ఆయనను అనాథ శవంలా పంపాల్సి వచ్చిందని గ్రామస్థులు వాపోయారు. మృతుని నుంచి నమూనాలు సేకరించామని, 2 రోజుల్లో ఫలితాలు వస్తాయని అధికారులు చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్న బర్రెలక్క వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఈ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. -
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు (TS Inter Summer Holidays) ప్రకటించింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (29/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్