హాంకాంగ్‌ కుక్కలకు యజమానుల ద్వారానే వైరస్‌

హాంకాంగ్‌లో కరోనా సోకిన రెండు కుక్కలకు వాటి యజమానుల ద్వారానే వైరస్‌ వ్యాపించిందని పరిశోధకులు గుర్తించారు. ఆ కుక్కలు, వాటి యజమానుల్లోని వైరస్‌ జన్యుక్రమాన్ని

Updated : 17 May 2020 08:11 IST

హాంకాంగ్‌లో కరోనా సోకిన రెండు కుక్కలకు వాటి యజమానుల ద్వారానే వైరస్‌ వ్యాపించిందని పరిశోధకులు గుర్తించారు. ఆ కుక్కలు, వాటి యజమానుల్లోని వైరస్‌ జన్యుక్రమాన్ని విశ్లేషించి ఈ నిర్ధారణకు వచ్చారు. ఈ కుక్కల నుంచి ఇతర కుక్కలకు లేదంటే మనుషులకు వైరస్‌ వ్యాపిస్తుందనడానికి ఎలాంటి ఆధారాలు దొరకలేదని వీరు వెల్లడించారు. కొవిడ్‌-19 బాధితుల నుంచి కుక్కలకు ఈ వైరస్‌ వ్యాపిస్తుందని స్పష్టమైనప్పటికీ అందుకుగల అవకాశాలు చాలా తక్కువని వీరు స్పష్టంచేస్తున్నారు. వ్యాధి బాధితులతో కలిసి ఉన్న 15 కుక్కల్లో కేవలం రెండింటికి మాత్రమే ఈ వైరస్‌ సోకిందని నెదర్లాండ్స్‌ వైద్యులు తమ అధ్యయనంలో గుర్తించారు. భవిష్యత్తులో తలెత్తే ముప్పులను నివారించాలంటే.. పెంపుడు జంతువుల మధ్య వైరస్‌ వ్యాప్తిపై కూలంకషంగా అధ్యయనం చేయాలని మరికొందరు పరిశోధకులు స్పష్టంచేస్తున్నారు. హాంకాంగ్‌లో ఈ రెండు కుక్కలతో పాటు, ఓ పిల్లి, న్యూయార్క్‌లో రెండు పిల్లులు, జంతు ప్రదర్శనశాలలోని 4 పులులు, 3 సింహాలు కూడా కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. అలానే పిల్లులపై నిర్వహించిన సర్వేలో.. ఇవి లక్షణాలు లేకుండా ఇతర పిల్లులకు ఈ వ్యాధిని వ్యాప్తి చేయగలవని పరిశోధకులు గుర్తించారు. ఈ నేపథ్యంలో వ్యాధి బాధితులు తమ పెంపుడు జంతువులకు దూరంగా ఉండాలని, తగు జాగ్రత్తలు తీసుకోవాలని పరిశోధకులు స్పష్టం చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని