10 లక్షల మంది తరలింపు: రైల్వే
శ్రామిక్ ప్రత్యేక రైళ్ల ద్వారా ఇప్పటివరకు దేశవ్యాప్తంగా సమారు 10 లక్షలమంది వలస కార్మికులను వారివారి స్వస్థలాలకు తరలించినట్టు రైల్వేశాఖ గురువారం పేర్కొంది. ఇందుకు గానూ 806 రైళ్లను వినియోగించినట్టు........
దిల్లీ: శ్రామిక్ ప్రత్యేక రైళ్ల ద్వారా ఇప్పటివరకు దేశవ్యాప్తంగా సమారు 10 లక్షలమంది వలస కార్మికులను వారివారి స్వస్థలాలకు తరలించినట్టు రైల్వేశాఖ గురువారం పేర్కొంది. ఇందుకు గానూ 806 రైళ్లను వినియోగించినట్టు తెలిపింది. మే 2న మొదలైన ఈ ప్రక్రియ కొనసాగుతూనే ఉందని, వీటిలో ఎక్కువశాతం బిహార్ నుంచి ఉత్తరప్రదేశ్కు వచ్చిన రైళ్లే ఉన్నాయని రైల్వే అధికారులు వెల్లడించారు. ఈ ప్రక్రియ అంతా రాష్ట్రాల పరస్పర అంగీకారంతో కట్టుదిట్టమైన జాగ్రత్తలు చేపట్టి వలసకార్మికులను సురక్షితంగా చేరవేస్తున్నామని తెలిపారు.
రైలులో ప్రయాణించే వారందరికీ ఉచిత భోజనం, మంచినీరు ఏర్పాట్లు రైల్వే శాఖే చేపట్టిందని అధికారులు వివరించారు. ఇప్పటి వరకు ఒక్కో రైలులో 1200 మందిని తరలిస్తుండగా సోమవారం నుంచి 1700 మంది వలస కార్మికులను తరలించేందుకు రైల్వే అధికారులు ప్రణాళికలు చేస్తున్నారు. వీరి టికెట్టు ఛార్జీలను కేంద్రప్రభుత్వం, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు 85:15 నిష్పత్తిలో భరిస్తున్న విషయం తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామక్రిష్ణ
ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా కుమార్ విశ్వజిత్, విజయవాడ పోలీస్ కమిషనర్గా పీహెచ్డీ రామక్రిష్ణను నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. -
భారాస అధినేత కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం
నల్గొండ జిల్లా వేములపల్లి వద్ద భారాస అధినేత కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం జరిగింది. -
అవనిగడ్డలో వైకాపా ర్యాలీ.. బాణసంచా పడి తెదేపా కార్యకర్త ఇల్లు దగ్ధం
కృష్ణా జిల్లా అవనిగడ్డలో వైకాపా అభ్యర్థి సింహాద్రి రమేశ్ బాబు నామినేషన్ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో అపశ్రుతి చోటు చేసుకుంది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఆ 80 కుటుంబాలకు రక్షణ కల్పించండి.. పోలీసులకు హైకోర్టు ఆదేశం
పల్నాడు జిల్లా ఆత్మకూరు గ్రామంలో 50, జంగమేశ్వరపాడు గ్రామంలో 30 కుటుంబాలకు రక్షణ కల్పించాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది. -
62వేల మంది వాలంటీర్లు రాజీనామా చేశారు.. కోర్టుకు తెలిపిన ఈసీ న్యాయవాది
ఏపీలో వాలంటీర్ల రాజీనామాల పిటిషన్పై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. -
జగన్పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి
సీఎం జగన్పై రాయి దాడి కేసులో నిందితుడు సతీష్ను కస్టడీకి ఇచ్చేందుకు కోర్టు అనుమతించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (24/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.