మంగళగిరి ఎయిమ్స్ వద్ద ఉద్రిక్తత
మంగళగిరి అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్) వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. తమను సొంతూళ్లకు పంపాలంటూ ఆందోళనకు దిగిన వలస కార్మికులు ...
వలస కార్మికుల ఆందోళన
మంగళగిరి (గుంటూరు): గుంటూరు జిల్లా మంగళగిరి అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్) వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. తమను సొంతూళ్లకు పంపాలంటూ ఆందోళనకు దిగిన వలస కార్మికులు పోలీసుల పైకి రాళ్లు రువ్వారు. ఎయిమ్స్లోని సెక్యూరిటీ గదిని ధ్వంసం చేశారు.
ఝార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఉత్తర్ప్రదేశ్, ఒడిశా తదితర రాష్ట్రాలకు చెందిన సుమారు 3 వేల మంది వలస కార్మికులు ఆందోళనకు దిగారు. దీర్ఘకాలంగా లాక్డౌన్ అమల్లో ఉండడం వల్ల తాము ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తమను స్వరాష్ట్రాలకు పంపాలని వారు డిమాండ్ చేశారు. మూడు రోజుల క్రితం అధికారులు వచ్చి హామీ ఇచ్చినా నెరవేర్చలేదని ఆరోపించారు. మిగిలిన రాష్ట్రాల నుంచి వలస కూలీలను తరలిస్తున్నప్పుడు తమను కూడా అలాగే తరలించాలంటూ వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో కార్మికులు అక్కడే ఉన్న సెక్యూరిటీ గదిని ధ్వంసం చేశారు. ఘటన స్థలానికి చేరుకున్న మంగళగిరి అడిషినల్ ఎస్పీ ఈశ్వర్రావు కూలీలతో మాట్లాడుతున్నారు. గుంటూరు జిల్లా ప్రస్తుతం రెడ్జోన్లో ఉన్న నేపథ్యంలో ఇతర రాష్ట్రాల వారు కూలీలను తీసుకెళ్లేందుకు సుముఖంగా లేరని వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్న బర్రెలక్క వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఈ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. -
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు (TS Inter Summer Holidays) ప్రకటించింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (29/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
ఉపాధ్యాయ బదిలీల్లో రూ.వందల కోట్ల కుంభకోణం: నాదెండ్ల మనోహర్
-
ఏప్రిల్ 1 నుంచి ఇ-బీమా.. ఇంతకీ ఏమిటిది? ఎవరికి ప్రయోజనం?
-
కేజ్రీవాల్కు సమయం లేదు.. అందుకే ఈ ప్రయత్నాలు! : పూరి
-
టెలికాం శాఖ పేరుతో కాల్స్ వస్తున్నాయా..? అయితే జాగ్రత్త..!
-
రైలు ప్రయాణికుడి సెల్ఫీతో డెత్ మిస్టరీని ఛేదించిన పోలీసులు
-
బ్యాంకులు, ఎల్ఐసీ కార్యాలయాలు.. ఈ శని, ఆదివారాల్లో తెరిచే ఉంటాయ్!