టీఎస్‌ సీడ్స్‌ అసోసియేషన్‌ రూ.3కోట్ల విరాళం

రాష్ట్రంలో కరోనా మహమ్మారి నియంత్రణ చర్యల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వానికి మద్దతుగా నిలిస్తూ పలు సంస్థలు సీఎం సహాయనిధికి విరాళాలు ప్రకటిస్తూనే ఉన్నాయి. తాజాగా రాష్ట్ర సీడ్స్‌మెన్‌ అసోషియేషన్ రూ. 3కోట్లు విరాళం ప్రకటించింది. ఇందులో రూ. 1.16 కోట్లు విరాళానికి..

Published : 07 May 2020 22:12 IST

హైదరాబాద్‌: రాష్ట్రంలో కరోనా మహమ్మారి నియంత్రణ చర్యల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వానికి మద్దతుగా నిలిస్తూ పలు సంస్థలు సీఎం సహాయనిధికి విరాళాలు ప్రకటిస్తూనే ఉన్నాయి. తాజాగా రాష్ట్ర సీడ్స్‌మెన్‌ అసోషియేషన్ రూ. 3కోట్లు విరాళం ప్రకటించింది. ఇందులో రూ. 1.16 కోట్లు విరాళానికి సంబంధించిన చెక్కును రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డికి సంస్థ ప్రతినిధులు ప్రవీణ్‌కుమార్, డైరెక్టర్ జగదీశ్వర్ రెడ్డి అందించారు. మరో రూ. 1.70 కోట్లు విరాళానికి సంబంధించిన చెక్కును సీడ్స్‌మెన్‌ అసోషియేషన్ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, మాజీ అధ్యక్షుడు ఏఎస్‌ఎన్ రెడ్డి మంత్రి కేటీఆర్‌కు అందజేశారు. మిగతా రూ. 14 లక్షలు వివిధ జిల్లాల నుంచి రాగానే అందజేస్తామని వారు చెప్పారు. ప్రభుత్వానికి విరాళం ఇచ్చిన సీడ్స్‌మెన్ అసోషియేషన్‌ను మంత్రులు అభినందించారు.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని