జనాలకు వైరస్..ఆ పాండాలకు జోష్
కరోనా దెబ్బకు పలు దేశాల్లో లాక్డౌన్ విధించారు. దీంతో ప్రజలు ఇళ్లకు పరిమితమయ్యారు. సందర్శుకులతో ఉండే పలు ప్రదేశాలు నిర్మానుష్యంగా
హాంగ్కాంగ్: కరోనా దెబ్బకు పలు దేశాల్లో లాక్డౌన్ విధించారు. దీంతో ప్రజలు ఇళ్లకు పరిమితమయ్యారు. సందర్శకులతో ఉండే పలు ప్రదేశాలు నిర్మానుష్యంగా మారాయి. దీంతో హాంకాంగ్లోని ఒక ‘పాండా’ పార్కులోని పాండాల జంట సందర్శకులు లేకపోవటంతో సరససల్లాపాలు మొదలుపెట్టాయి. ఇంగ్ఇంగ్ అనే ఆడ పాండా, లీలీ అనే మగ పాండా దాదాపు పదేళ్ల తర్వాత ఏకాంతంగా గడిపాయి. 2010లో ఒక్కసారి కలిసిన ఈ జంట మళ్లీ ఇపుడే ఒక్కటయ్యాయని పార్క్ సంరక్షకులు అంటున్నారు. ఇందుకు సంబంధించి ఫొటోలను సామాజిక మాధ్యమాలలో ఉంచగా అనూహ్య స్పందన లభిస్తోంది. సాధారణంగా పాండాలు పునురుత్పత్తిలో అంతగా ఆసక్తి చూపించవని, అందునా బంధీఖానాలో ఉన్నప్పుడు అస్సలు ఆ వ్యాపకమే ఉండదని వారు అంటున్నారు. ఇన్నాళ్లు ఆడ పాండా ఇంగ్ఇంగ్ నీళ్లతో ఆడుకుంటూ మడుగు దగ్గర గడపగా, లీలీ ఆ మడుగు చుట్టూ తిరుగుతూ ఇంగ్ఇంగ్ను ఆకర్షించడానికి ప్రయత్నించేదని సంరక్షకులు చెబుతున్నారు. ప్రస్తుతం పాండాలు వాటి తోకల ద్వారా ఒకదానికొకటి ప్రేమ సంకేతాలు పంపుకుంటున్నాయన్నారు. జంతునిపుణులు ఇంగ్ఇంగ్ గర్భధారణ సంకేతాలను గమనిస్తున్నారని, పాండాల గర్భధారణ సమయం 72 రోజుల నుంచి 324 రోజలు ఉంటుందని వారు అంటున్నారు. ప్రస్తుతం ఇంగ్ఇంగ్లో గర్భధారణ సంకేతాలు కనిపిస్తున్నాయని, త్వరలోనే పిల్లపాండా రానుందని పార్క్ సంరక్షకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అవసరమైతే తప్ప బయటకు రావొద్దు: వాతావరణశాఖ
రాష్ట్రంలో 3 రోజుల పాటు కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
అష్టాదశ శక్తి పీఠక్షేత్రమైన శ్రీశైలం(Srisailam)లో కుంభోత్సవం వైభవంగా ప్రారంభమైంది. శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారి ఆలయాన్ని నిమ్మకాయలతో అలంకరించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగన్ మామయ్యా.. పాఠశాలల గోడు వినవయ్యా
నాడు- నేడుతో సర్కారు బడుల రూపు రేఖలు మార్చేశామని చెబుతున్నా.. చాలా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. -
మూడో దశ.. మాటే లేదు
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
అడిగే వారేరి... ఆపేవారేరి?
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
రివ్యూ: రత్నం.. విశాల్ నటించిన యాక్షన్ డ్రామా మెప్పించిందా?
-
డీజీసీఏ కొత్త రూల్.. విమాన టికెట్ల ధరలు తగ్గుతాయా?
-
‘వీవీప్యాట్ల’పై సుప్రీం తీర్పు.. విపక్షాలకు గట్టి చెంపదెబ్బ: మోదీ
-
అవసరమైతే తప్ప బయటకు రావొద్దు: వాతావరణశాఖ
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా