పట్టీ రూపంలో కరోనా టీకా
కరోనా వైరస్ను నిరోధించే ఒక టీకాను అమెరికా పరిశోధకులు రూపొందించారు. దీన్ని ఎలుకలపై ప్రయోగించారు. ఇది వేలి ముద్ర పరిమాణంలో ఉన్న ఒక పట్టీలా ఉంటుంది. ఇది నేరుగా టీకాను ప్రవేశపెడుతుంది. ఈ టీకాకు పిట్కోవాక్ (పిట్స్బర్గ్ కరోనావైరస్
వాషింగ్టన్: కరోనా వైరస్ను నిరోధించే ఒక టీకాను అమెరికా పరిశోధకులు రూపొందించారు. దీన్ని ఎలుకలపై ప్రయోగించారు. ఇది వేలి ముద్ర పరిమాణంలో ఉన్న ఒక పట్టీలా ఉంటుంది. ఇది నేరుగా టీకాను ప్రవేశపెడుతుంది. ఈ టీకాకు పిట్కోవాక్ (పిట్స్బర్గ్ కరోనావైరస్ వ్యాక్సిన్) అని పేరుపెట్టారు. దీన్ని పిట్స్బర్గ్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు రూపొందించారు. ఈ పట్టీని ఎలుకలపై ప్రయోగించినప్పుడు వాటిలోని రోగ నిరోధక వ్యవస్థ.. కరోనా వైరస్ను నాశనం చేసే నిర్దిష్ట యాంటీబాడీలను ఉత్పత్తి చేశాయి. రెండు వారాల్లోనే వీటి సంఖ్య భారీగా పెరిగాయి. ఈ వైరస్లోని స్పైక్ ప్రొటీన్ అనే నిర్దిష్ట భాగం ఆధారంగా దీన్ని తయారుచేసినట్లు పరిశోధకులు పేర్కొన్నారు. ఇంజెక్షన్ రూపంలో కాకుండా పట్టీ ద్వారా దీన్ని శరీరంలోకి ప్రవేశపెట్టాలని నిర్ణయించినట్లు చెప్పారు. దీనివల్ల టీకా సామర్థ్యం పెరుగుతుందని తెలిపారు. పట్టీలో దాదాపు 400 సూక్ష్మసూదులు ఉంటాయి. ఇవి స్పైక్ ప్రొటీన్ భాగాలను చర్మంలోకి ప్రవేశపెడతాయి. చర్మంలో శరీర రోగ నిరోధక వ్యవస్థ ప్రతిస్పందన బలంగా ఉంటుంది. ఈ పట్టీని ఒంటిపై అతికించినప్పుడు నొప్పి ఉండదు. ఈ టీకాను సాధారణ ఉష్ణోగ్రత వద్దే నిల్వ చేయవచ్చు. చల్లబరచాల్సిన అవసరం లేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వివేకా హత్యకేసు.. సీబీఐ కోర్టుకు ఎంపీ అవినాష్రెడ్డి
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు విచారణ గురువారం సీబీఐ కోర్టులో జరిగింది. -
స్కిల్ డెవలప్మెంట్ కేసు.. అచ్చెన్నాయుడికి ఊరట
స్కిల్ డెవలప్మెంట్ కేసులో తెదేపా ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు(Atchannaidu)కి ఊరట లభించింది. -
ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను నియమించిన కేంద్ర ఎన్నికల సంఘం
ఎన్నికల దృష్ట్యా ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను కేంద్ర ఎన్నికల సంఘం (Elections Commission) నియమించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
తిరుమల నడక మార్గంలో చిరుత సంచారం
అలిపిరి కాలిబాటలో చిరుత సంచారం కలకలం సృష్టించింది. ఈ నెల 25, 26 తేదీల్లో ఇక్కడి నడక మార్గంలో చిరుత కదలికలు కనిపించాయి. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (28/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
రసవత్తరంగా సాగుతున్న మెగా లీగ్.. తొలి రోజు వీక్షణల్లోనూ రికార్డే
-
ఈడీ విచారణను ఎదుర్కొంటా.. కోర్టులో కేజ్రీవాల్ స్వీయ వాదనలు
-
అనుపమ బాధపడటానికి కారణమదే: సిద్ధు జొన్నలగడ్డ
-
ఫోన్ ట్యాపింగ్ కేసు.. పోలీసుల అదుపులో మరో ఇద్దరు
-
మ్యూచువల్ ఫండ్స్లో మదుపు చేస్తున్నారా? రీకేవైసీకి మార్చి 31 డెడ్లైన్!
-
వివేకా హత్యకేసు.. సీబీఐ కోర్టుకు ఎంపీ అవినాష్రెడ్డి