మహమ్మారులను దాటేస్తున్న కరోనా

చరిత్రలో ఎన్నో విపత్కర వైరస్‌లను ఎదుర్కొన్న మానవాళి మరో మహమ్మారితో పోరాడుతోంది. చైనాలోని వుహాన్‌ నగరంలో వెలుగు చూసిన కొవిడ్‌-19 (కరోనా వైరస్‌) ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తోంది. దాని తీవ్రత ప్రపంచ..

Published : 21 Mar 2020 00:53 IST

ఎబోలాకు సమీపంలో కొవిడ్‌-19

చరిత్రలో ఎన్నో విపత్కర వైరస్‌లను ఎదుర్కొన్న మానవాళి మరో మహమ్మారితో పోరాడుతోంది. చైనాలోని వుహాన్‌ నగరంలో వెలుగు చూసిన కొవిడ్‌-19 (కరోనా వైరస్‌) ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తోంది. దాని తీవ్రత ప్రపంచ యుద్ధం కంటే అధికమని భారత ప్రధాని మోదీ సైతం పేర్కొనడం గమనార్హం. దానికి కారణం కొద్ది రోజుల్లోనూ కొవిడ్‌-19 ప్రపంచమంతా వ్యాపించి 10వేల మందికి పైగా బలితీసుకుంది. సార్స్‌, మెర్స్‌ వైరస్‌ మరణాలను దాటేసి.. ఎబోలా మరణాల సంఖ్యకు చేరువలో నిలిచి నేను ఎంతో ప్రమాదకరమని హెచ్చరిస్తుంది.

ఇలాంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కోవడం మానవాళికి కొత్తేమి కాదు. గతంలో ఎన్నో మహమ్మారులతో పోరాడింది. ప్లేగు, స్మాల్‌ పాక్స్‌ వంటి ప్రమాదకర వ్యాధులను జయించింది. బ్లాక్‌ డెత్‌ (ప్లేగు) కారణంగా దాదాపు 20 కోట్ల మంది మరణించారు. మహమ్మారుల్లో ప్లేగు వ్యాధే ఎక్కువ మందిని బలిగొంది. ఎలుకల ద్వారా వచ్చిన ఈ వ్యాధి వల్ల యూరప్‌ ప్రజల్లో దాదాపు 30-40 శాతం మంది మరణించారు. ఆ తర్వాత స్మాల్‌పాక్స్‌ ప్రపంచంపై అతిపెద్ద ప్రభావం చూపించింది. స్మాల్‌పాక్స్‌తో దాదాపు 5.6 కోట్ల మంది ప్రాణాలు కోల్పోయారు. అంతేకాక స్పానిష్‌ ఫ్లూతో 4-5 కోట్ల మంది వరకు మృత్యువాతపడ్డారు. అయితే ఆధునిక కాలంలో కొవిడ్‌-19 అత్యంత ప్రభావం చూపిస్తుంది. 


ఎబోలాకి సమీపంలో

సార్స్‌, మెర్స్‌ వైరస్‌ మరణాల సంఖ్యను కరోనా దాటేసింది. ఈ రెండు వైరస్‌లు.. కరోనా వైరస్‌ ఉపకుటుంబానికి చెందినవి. సార్స్‌ కారణంగా 2002-03 మధ్యలో 700 మంది మరణించగా, మెర్స్‌తో ఇప్పటివరకు 850 మంది ప్రాణాలు కోల్పోయారు. మెర్స్‌ను క్యామెల్‌ ఫ్లూ అని కూడా అంటారు. అయితే కొవిడ్‌-19 ఎబోలా వైరస్‌ కంటే ప్రమాదకరంగా మారుతోంది. ఎబోలాను మొదటిసారిగా 1976లో గుర్తించారు. దీని తీవ్రత పశ్చిమ ఆఫ్రికాపై అధికంగా ఏర్పడింది. ఎబోలాతో 11,300 మంది మరణించగా ఆ సంఖ్యకు కొవిడ్‌-19 చేరువైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని