మహమ్మారులను దాటేస్తున్న కరోనా
చరిత్రలో ఎన్నో విపత్కర వైరస్లను ఎదుర్కొన్న మానవాళి మరో మహమ్మారితో పోరాడుతోంది. చైనాలోని వుహాన్ నగరంలో వెలుగు చూసిన కొవిడ్-19 (కరోనా వైరస్) ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తోంది. దాని తీవ్రత ప్రపంచ..
ఎబోలాకు సమీపంలో కొవిడ్-19
చరిత్రలో ఎన్నో విపత్కర వైరస్లను ఎదుర్కొన్న మానవాళి మరో మహమ్మారితో పోరాడుతోంది. చైనాలోని వుహాన్ నగరంలో వెలుగు చూసిన కొవిడ్-19 (కరోనా వైరస్) ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తోంది. దాని తీవ్రత ప్రపంచ యుద్ధం కంటే అధికమని భారత ప్రధాని మోదీ సైతం పేర్కొనడం గమనార్హం. దానికి కారణం కొద్ది రోజుల్లోనూ కొవిడ్-19 ప్రపంచమంతా వ్యాపించి 10వేల మందికి పైగా బలితీసుకుంది. సార్స్, మెర్స్ వైరస్ మరణాలను దాటేసి.. ఎబోలా మరణాల సంఖ్యకు చేరువలో నిలిచి నేను ఎంతో ప్రమాదకరమని హెచ్చరిస్తుంది.
ఇలాంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కోవడం మానవాళికి కొత్తేమి కాదు. గతంలో ఎన్నో మహమ్మారులతో పోరాడింది. ప్లేగు, స్మాల్ పాక్స్ వంటి ప్రమాదకర వ్యాధులను జయించింది. బ్లాక్ డెత్ (ప్లేగు) కారణంగా దాదాపు 20 కోట్ల మంది మరణించారు. మహమ్మారుల్లో ప్లేగు వ్యాధే ఎక్కువ మందిని బలిగొంది. ఎలుకల ద్వారా వచ్చిన ఈ వ్యాధి వల్ల యూరప్ ప్రజల్లో దాదాపు 30-40 శాతం మంది మరణించారు. ఆ తర్వాత స్మాల్పాక్స్ ప్రపంచంపై అతిపెద్ద ప్రభావం చూపించింది. స్మాల్పాక్స్తో దాదాపు 5.6 కోట్ల మంది ప్రాణాలు కోల్పోయారు. అంతేకాక స్పానిష్ ఫ్లూతో 4-5 కోట్ల మంది వరకు మృత్యువాతపడ్డారు. అయితే ఆధునిక కాలంలో కొవిడ్-19 అత్యంత ప్రభావం చూపిస్తుంది.
ఎబోలాకి సమీపంలో
సార్స్, మెర్స్ వైరస్ మరణాల సంఖ్యను కరోనా దాటేసింది. ఈ రెండు వైరస్లు.. కరోనా వైరస్ ఉపకుటుంబానికి చెందినవి. సార్స్ కారణంగా 2002-03 మధ్యలో 700 మంది మరణించగా, మెర్స్తో ఇప్పటివరకు 850 మంది ప్రాణాలు కోల్పోయారు. మెర్స్ను క్యామెల్ ఫ్లూ అని కూడా అంటారు. అయితే కొవిడ్-19 ఎబోలా వైరస్ కంటే ప్రమాదకరంగా మారుతోంది. ఎబోలాను మొదటిసారిగా 1976లో గుర్తించారు. దీని తీవ్రత పశ్చిమ ఆఫ్రికాపై అధికంగా ఏర్పడింది. ఎబోలాతో 11,300 మంది మరణించగా ఆ సంఖ్యకు కొవిడ్-19 చేరువైంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగనన్నా.. దాహం తీర్చవయ్యా!
వేసవి కాలం వచ్చింది. ఎండలు మండిపోతున్నాయి. నీటి ఎద్దడి ఏర్పడుతోంది. అధికారులు గుక్కెడు నీరు కూడా ఇవ్వలేకపోతున్నారు. దాహం తీర్చుకోవడానికి ప్రజలు నానాఇబ్బందులు పడుతున్నారు. ఇదీ పట్టణంలోని పలు ప్రాంతాల్లోని పరిస్థితి. -
పేదల పాలిట.. వినాసికారే..!
రాష్ట్ర, చీప్ లిక్కర్కు కేంద్రంగా మారిపోయింది. ‘జే’బ్రాండ్ పేరుతో తీసుకొచ్చిన నాసిరకం మద్యం ప్రజల ప్రాణాలు హరిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పించినా ఈ ప్రభుత్వం లెక్క చేసిన దాఖలాలు లేవు. -
వినియోగదారులకు రెట్టింపు షాక్
ఐదేళ్ల పాలనలో ఇప్పటికే పలుమార్లు విద్యుత్తు ఛార్జీలు పెంచేసి సామాన్యులపై మోయలేని భారం వేసిన వైకాపా ప్రభుత్వం.. తాజాగా కొత్త మార్గంలో బాదుడు మొదలెట్టింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
20 నుంచి పవన్ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం
-
మహిళకు శస్త్రచికిత్స చేసి.. తల్లీ బిడ్డను కాపాడిన దర్శి అభ్యర్థి
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
మనిషికి రూ.200.. యువతకు పెట్రోలు కూపన్లు
-
నడుం నొప్పి, కుంగుబాటు, తలనొప్పి.. అనారోగ్యానికి ప్రధాన కారణాలివే