కరోనా ఎఫెక్ట్: పలు రైళ్లు రద్దు
కరోనా వ్యాప్తి నేపథ్యంలో భారతీయ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 18 నుంచి 31వ తేదీ వరకు పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. విశాఖ, భువనేశ్వర్, సికింద్రాబాద్, పూరీ..
భువనేశ్వర్: కరోనా వ్యాప్తి నేపథ్యంలో భారతీయ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 18 నుంచి 31వ తేదీ వరకు పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. విశాఖ, భువనేశ్వర్, సికింద్రాబాద్, పూరీ మధ్య నడిచే ఎనిమిది ప్రత్యేక రైళ్లను రద్దు చేసినట్లు ఆ ప్రకటనలో పేర్కొంది. ప్రత్యేక రైళ్లతో పాటుగా మరో 23 రైళ్లను ఈ నెల 30 వరకు రద్దు చేసినట్లు ప్రకటనలో పేర్కొంది. దేశవ్యాప్తంగా ప్రజలను కరోనా వైరస్ ఆందోళనకు గురిచేస్తున్న నేపథ్యంలో ప్రయాణికుల సంఖ్య భారీగా తగ్గిందని.. అందుకే ఈ నెల 31 వరకు ప్రత్యేక రైళ్లను రద్దు చేసినట్లు భారతీయ రైల్వే వెల్లడించింది.
రద్దు అయిన రైళ్ల వివరాలు...
11008 – పుణె-ముంబయి దక్కన్ ఎక్స్ప్రెస్– మార్చి 18 నుంచి 30 వరకు
11007 – ముంబై-పుణె డెక్కన్ ఎక్స్ప్రెస్ - మార్చి 19 నుంచి మార్చి 31 వరకు
11201 - ఎల్టీటీ-ఏజేఎన్జే ఎక్స్ప్రెస్ - మార్చి 23, మార్చి 30
11202 – ఏజేఎన్జే-ఎల్టీటీ ఎక్స్ప్రెస్ – మార్చి 20, మార్చి 27
11205 - ఎల్టిటి-నిజామాబాద్ ఎక్స్ప్రెస్ - మార్చి 21 మరియు మార్చి 28 న మాత్రమే
11206 - నిజామాబాద్-ఎల్టీటీ ఎక్స్ప్రెస్ - మార్చి 22 మరియు మార్చి 29 న మాత్రమే
22135/22136 - నాగ్పూర్-రేవా ఎక్స్ప్రెస్ - మార్చి 25న మాత్రమే
11401 - ముంబయి-నాగ్పూర్ నందిగ్రామ్ ఎక్స్ప్రెస్ - మార్చి 23 నుంచి ఏప్రిల్ 1 వరకు
11402 - నాగ్పూర్-ముంబై నందిగ్రామ్ ఎక్స్ప్రెస్ - మార్చి 22 నుంచి మార్చి 31 వరకు
11417 - పుణె-నాగ్పూర్ ఎక్స్ప్రెస్ - మార్చి 26, ఏప్రిల్ 2న
11418 - నాగ్పూర్-పుణె ఎక్స్ప్రెస్ - మార్చి 20, 27న
22139 - పుణె-అజ్ని ఎక్స్ప్రెస్ - మార్చి 21, 28న
22140 - అజ్ని-పుణె ఎక్స్ప్రెస్ - మార్చి 22, 29న
12117/12118 - ఎల్టిటి-మన్మాడ్ ఎక్స్ప్రెస్ - మార్చి 18 నుంచి 31 వరకు
12125 - ముంబయి-పుణె ప్రగతి ఎక్స్ప్రెస్ - మార్చి 18 నుంచి 31 వరకు
12126 - పుణె-ముంబయి ప్రగతి ఎక్స్ప్రెస్ - మార్చి 19 నుంచి ఏప్రిల్ 1 వరకు
22111 - భూసవల్-నాగ్పూర్ ఎక్స్ప్రెస్ - మార్చి 18 నుంచి 29 వరకు
22112 - నాగ్పూర్-భూసావల్ ఎక్స్ప్రెస్ - మార్చి 19 నుంచి మార్చి 30 వరకు
11307/11308 - కలబురగి-సికింద్రాబాద్ ఎక్స్ప్రెస్ - మార్చి 18 నుంచి 31 వరకు
12262 - హౌరా-ముంబయి దురంతో ఎక్స్ప్రెస్ - మార్చి 24, మార్చి 31న మాత్రమే
12261 - ముంబయి-హౌరా దురంతో ఎక్స్ప్రెస్ - మార్చి 25, ఏప్రిల్ 1న మాత్రమే
22221 - సీఎస్ఎంటీ-నిజాముద్దీన్ రాజధాని ఎక్స్ప్రెస్ - మార్చి 20, 23, 27, 30న మాత్రమే
22222 - నిజాముద్దీన్-సీఎస్ఎమ్టీ రాజధాని ఎక్స్ప్రెస్ - మార్చి 21, 24, 26, 31న మాత్రమే
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగనన్నా.. దాహం తీర్చవయ్యా!
వేసవి కాలం వచ్చింది. ఎండలు మండిపోతున్నాయి. నీటి ఎద్దడి ఏర్పడుతోంది. అధికారులు గుక్కెడు నీరు కూడా ఇవ్వలేకపోతున్నారు. దాహం తీర్చుకోవడానికి ప్రజలు నానాఇబ్బందులు పడుతున్నారు. ఇదీ పట్టణంలోని పలు ప్రాంతాల్లోని పరిస్థితి. -
పేదల పాలిట.. వినాసికారే..!
రాష్ట్ర, చీప్ లిక్కర్కు కేంద్రంగా మారిపోయింది. ‘జే’బ్రాండ్ పేరుతో తీసుకొచ్చిన నాసిరకం మద్యం ప్రజల ప్రాణాలు హరిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పించినా ఈ ప్రభుత్వం లెక్క చేసిన దాఖలాలు లేవు. -
వినియోగదారులకు రెట్టింపు షాక్
ఐదేళ్ల పాలనలో ఇప్పటికే పలుమార్లు విద్యుత్తు ఛార్జీలు పెంచేసి సామాన్యులపై మోయలేని భారం వేసిన వైకాపా ప్రభుత్వం.. తాజాగా కొత్త మార్గంలో బాదుడు మొదలెట్టింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
20 నుంచి పవన్ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం
-
మహిళకు శస్త్రచికిత్స చేసి.. తల్లీ బిడ్డను కాపాడిన దర్శి అభ్యర్థి
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
మనిషికి రూ.200.. యువతకు పెట్రోలు కూపన్లు
-
నడుం నొప్పి, కుంగుబాటు, తలనొప్పి.. అనారోగ్యానికి ప్రధాన కారణాలివే