రూ.60 లక్షల లాటరీ గెలిచాడు.. ఇంతలోనే!
కేరళలో ఓ వ్యక్తికి లాటరీ రూపంలో అదృష్టం తలుపు తట్టింది. కానీ దాని కన్నా ముందే దురదృష్టం చావు రూపంలో ఆ వ్యక్తిని తన కుటుంబానికి దూరం చేసింది. కేరళలోని అలప్పుజాలో ఓ వ్యక్తిని రూ.60లక్షల విలువ చేసే లాటరీ వరించినా..
కొచ్చి: కేరళలో ఓ వ్యక్తికి లాటరీ రూపంలో అదృష్టం తలుపు తట్టింది. కానీ దాని కన్నా ముందే దురదృష్టం చావు రూపంలో ఆ వ్యక్తిని తన కుటుంబానికి దూరం చేసింది. కేరళలోని అలప్పుళలో ఓ వ్యక్తిని రూ.60లక్షల విలువ చేసే లాటరీ వరించినా.. దాన్ని పొందడానికి ముందే గుండెపోటుతో మరణించడం ఆ కుటుంబాన్ని తీవ్రంగా కలచివేసింది. వివరాల్లోకి వెళ్తే.. అలప్పుళ జిల్లా మావెలికర గ్రామానికి చెందిన సి.తంబి ఓ దుకాణం నిర్వహిస్తున్నాడు.
తంబి ఇటీవల తన దుకాణంలో ‘స్త్రీ శక్తి’ లాటరీలు కూడా తెచ్చి విక్రయించాడు. తన వద్ద ఉన్న లాటరీలన్నీ విక్రయించగా.. చివరగా పది టిక్కెట్లు మాత్రం మిగిలిపోయాయి. లాటరీ బహుమతుల ఫలితాలు వెల్లడించగా.. అతడి వద్ద ఉన్న టిక్కెట్లలో ఒకదానికి రూ.60 లక్షల బహుమతి వరించడం విశేషం. దీంతో తంబి ఎంతో సంతోషంతో.. వెంటనే ఆ నగదు బహుమతి పొందేందుకు ఫెడరల్ బ్యాంక్కు వెళ్లి టిక్కెట్ను సమర్పించాడు. దాంతో వచ్చే డబ్బుతో తన దుకాణం విస్తరణతో పాటు పిల్లల భవిష్యత్తుకు ప్రణాళికలు వేసుకున్నాడు. కానీ ఇంతలోనే విధి అతడిని మరో రకంగా పలకరించింది. ఛాతి నొప్పి రావడంతో కుప్పకూలిపోయాడు. అతన్ని ఆసుపత్రికి తరలించారు. అక్కడ అతను కన్నుమూసినట్టు వైద్యులు తెలిపారు. ఆయన మరణం కుటుంబసభ్యులు, స్థానికుల్ని కలచివేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నన్ను చంపేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ సంచలన ఆరోపణలు చేశారు. -
అవసరమైతే తప్ప బయటకు రావొద్దు: వాతావరణశాఖ
రాష్ట్రంలో 3 రోజుల పాటు కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
అష్టాదశ శక్తి పీఠక్షేత్రమైన శ్రీశైలం(Srisailam)లో కుంభోత్సవం వైభవంగా ప్రారంభమైంది. శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారి ఆలయాన్ని నిమ్మకాయలతో అలంకరించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగన్ మామయ్యా.. పాఠశాలల గోడు వినవయ్యా
నాడు- నేడుతో సర్కారు బడుల రూపు రేఖలు మార్చేశామని చెబుతున్నా.. చాలా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. -
మూడో దశ.. మాటే లేదు
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
అడిగే వారేరి... ఆపేవారేరి?
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
-
5 రోజుల వరుస లాభాలకు బ్రేక్.. 600 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
-
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ
-
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
-
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?
-
ఎయిర్ గెశ్చర్స్తో రియల్మీ నుంచి బడ్జెట్ కొత్త ఫోన్