రాజధాని రైతుల శిరిడీ పయనం

ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ రైతులు చేస్తున్న ఆందోళనలు 57వ రోజుకు చేరాయి. మహిళలు, రైతులు...

Published : 12 Feb 2020 13:40 IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ రైతులు చేస్తున్న ఆందోళనలు 57వ రోజుకు చేరాయి. మహిళలు, రైతులు, యువత ప్రభుత్వ తీరుపై  రోజుకో రూపంలో తమ నిరసన తెలియజేస్తున్నారు. ఇందులో భాగంగా  రాజధాని రైతులు, మహిళలు బుధవారం శిరిడీ బయల్దేరి వెళ్లారు. విజయవాడ రైల్వే స్టేషన్‌ నుంచి సుమారు 200 మంది ‘జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్‌.. అమరావతిని రక్షించండి’ అంటూ నినాదాలు చేస్తూ శిరిడీ సాయి దర్శానికి బయలుదేరి వెళ్లారు. మూడు రాజధానుల నిర్ణయం మార్చుకుని, రాజధానిగా అమరావతినే కొనసాగించేలా ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి మనసు మారాలని సాయిబాబాను వేడుకోనున్నట్లు రైతులు తెలిపారు. అమరావతి కోసం ఆలయంలో ప్రత్యేక పూజలు చేయనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని