రాజధాని పోరు: గుండెపోటుతో మహిళ మృతి

రాజధాని కోసం మరో గుండె ఆగిపోయింది. రాజధానిని తరలిస్తున్నారని మనస్తాపానికి గురై తుళ్లూరు మండలం మందడం గ్రామానికి చెందిన భారతి (55) అనే మహిళ ...

Updated : 29 Jan 2020 10:07 IST

అమరావతి: రాజధాని కోసం మరో గుండె ఆగిపోయింది. రాజధానిని తరలిస్తున్నారని మనస్తాపానికి గురై తుళ్లూరు మండలం మందడం గ్రామానికి చెందిన భారతి (55) అనే మహిళ గుండెపోటుతో మృతి చెందారు. ఈ మేరకు ఆమె బంధువులు తెలిపారు. గత కొన్ని రోజులుగా రాజధాని రైతులు చేస్తున్న ఆందోళనల్లో భారతి పాల్గొన్నారు.

మరోవైపు రాజధాని రైతుల ఆందోళన 43వ రోజుకు చేరుకుంది. రాజధాని తరలింపు ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ తుళ్లూరు నుంచి మరికాసేపట్లో  భారీ వాహన ర్యాలీ ప్రారంభం కానుంది. రాజధాని గ్రామాల గుండా ప్రదర్శన కొనసాగనుంది. రాయపూడి, ఉద్దండరాయునిపాలెం, మోదు లింగాయపాలెం, వెలగపూడి, మల్కాపురం, మందడం, కృష్ణాయపాలెం, పెనుమాక, ఎర్రబాలెం, నవులూరు, నిడమర్రు, కురగల్లు, నీరుకొండ, పెదపరిమి, నెక్కల్లు, అనంతవరం, వడ్డమాను, హరిచంద్రపురం, బోరుపాలెం, దొండపాడు గ్రామాల మీదుగా ప్రదర్శన తిరిగి తుళ్లూరు చేరుకోనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని