జలకాలాడారు.. జరిమానా కట్టారు
స్నానం చేసినందుకు ఫైన్ కట్టడమేంటి అనుకుంటున్నారా..? అవును నిజమే.. వియత్నాంలో స్నానం చేసిన ఇద్దరికి ట్రాఫిక్ పోలీసు అధికారులు జరిమానా విధించారు. ఇంతకీ వాళ్లిద్దరూ స్నానం చేసింది ఎక్కడో తెలుసా..?
ఇంటర్నెట్డెస్క్: స్నానం చేసినందుకు ఫైన్ కట్టడమేంటి అనుకుంటున్నారా..? అవును నిజమే.. వియత్నాంలో స్నానం చేసిన ఇద్దరికి ట్రాఫిక్ పోలీసు అధికారులు జరిమానా విధించారు. ఇంతకీ వాళ్లిద్దరూ స్నానం చేసింది ఎక్కడో తెలుసా..? ఏ బాత్రూమ్లోనో కాదు.. చెరువులోనో.. కాలువలోనో కాదు. నడి రోడ్డుపై ద్విచక్రవాహనంపై వెళుతూ వారిద్దరూ స్నానం చేశారు. ఇద్దరి మధ్యలో నీళ్ల బకెట్ పెట్టుకొని సబ్బు రుద్దుకొని మరీ స్నానం చేశారు. ఒకరు వాహనం నడిపిస్తుండగా వెనకాల కూర్చున్న మరో వ్యక్తి తలపై నీళ్లు పోస్తూ.. రోడ్డుపై వెళుతూనే ఈ తతంగమంతా కానిచ్చారు. దీన్ని మరో వాహనదారుడు వీడియో తీశాడు. ఆ వీడియో కాస్తా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. అలా.. ట్రాఫిక్ పోలీసులకు చేరడంతో బండి నంబరు ఆధారంగా వాళ్లను గుర్తించారు. నీటిని వృథా చేయడంతో పాటు ట్రాఫిక్ నిబంధనలు విస్మరించి నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు వాళ్లిద్దరికీ జరిమానా విధించారు. వాళ్లు చేసిన ఈ ఘనకార్యానికి ఏకంగా 80 డాలర్లు చెల్లించాల్సి వచ్చింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ఇలాంటి చర్యలతో సమాజానికి ఏం సందేశమివ్వాలనుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏపీ, తెలంగాణకు సాగర్ నీటి విడుదలపై కేఆర్ఎంబీ ఉత్తర్వులు
వేసవిలో తాగునీటి అవసరాల కోసం కృష్ణానది యాజమాన్య బోర్డు నీటి విడుదల ఉత్తర్వులు జారీ చేసింది. -
గరిష్ఠ ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం: వాతావరణ శాఖ
రాష్ట్రంలో గురు, శుక్రవారాల్లో కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ వడగాల్పులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. -
భద్రాచలంలో కనులపండువగా శ్రీరామ మహా పట్టాభిషేకం
శ్రీరామ మహా పట్టాభిషేక మహోత్సవ వేడుకతో గురువారం భద్రగిరి దివ్యక్షేత్రం పులకించింది. వేద మంత్రోచ్ఛరణల మధ్య సింహాసనాన్ని అధిష్ఠించిన రామచంద్రుడు భక్తకోటికి నేనున్నానంటూ కొండంత అభయమిచ్చాడు. -
జగన్పై రాయి దాడి కేసు.. ఆ ఆరుగురి వివరాలు తెలపాలంటూ కోర్టులో పిటిషన్
సీఎం జగన్పై రాయి దాడి వ్యవహారంపై విజయవాడ కోర్టులో పిటిషన్ దాఖలైంది. పోలీసుల అదుపులో ఉన్న ఆరుగురి వివరాలు తెలపాలంటూ న్యాయవాది సలీం ఈ పిటిషన్ వేశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
అనుమానిత బుకీలను గుర్తించిన బీసీసీఐ యాంటీ కరప్షన్ యూనిట్!
-
సూచీలకు వరుస నష్టాలు.. 22 వేల దిగువకు నిఫ్టీ
-
పదేళ్లలో తెలంగాణకు భాజపా ఏం చేసిందో చెప్పాలి?: పొన్నం ప్రభాకర్
-
‘అంతరిక్షమూ’ యుద్ధ క్షేత్రమే : త్రిదళాధిపతి అనిల్ చౌహాన్
-
చంద్రబాబు సమక్షంలో తెదేపాలో చేరిన భీమిలి, జీడీ నెల్లూరు వైకాపా నేతలు
-
బెయిల్ కోసం.. కేజ్రీవాల్ మామిడి పండ్లు, స్వీట్లు తింటున్నారు: ఈడీ