ఆ మంత్రి బూట్లను మోసేందుకో వ్యక్తి..!

ఒడిషాకు చెందిన ఓ మంత్రి ఆదివారం గణతంత్ర వేడుకల్లో పాల్గొన్న తీరు వివాదానికి దారి తీసింది. జెండా వందన సమయంలో మంత్రి బూట్లను ఓ వ్యక్తి పట్టుకున్న వీడియో వైరల్‌గా మారడమే ఇందుకు కారణం.

Published : 26 Jan 2020 23:02 IST

భువనేశ్వర్‌: ఒడిశాకు చెందిన ఓ మంత్రి ఆదివారం గణతంత్ర వేడుకల్లో పాల్గొన్న తీరు వివాదానికి దారి తీసింది. జెండా వందన సమయంలో మంత్రి బూట్లను ఓ వ్యక్తి పట్టుకున్న వీడియో వైరల్‌గా మారడమే ఇందుకు కారణం. మీడియా వర్గాల వివరాల ప్రకారం.. వాణిజ్య, రవాణా శాఖ మంత్రి పద్మనాభ్‌ బెహరా గణతంత్ర వేడుకలు నిర్వహించేందుకు కియోంజార్‌ జిల్లా కేంద్రానికి చేరుకున్నారు. జెండా ఎగురవేసే క్రమంలో ఆయన బూట్లను పక్కన వదలగా.. వాటిని ఓ వ్యక్తి చేత్తో పట్టుకున్నాడు. జెండా వందన కార్యక్రమం అనంతరం మళ్లీ ఆ వ్యక్తి బూట్లను మంత్రి పాదాల వద్ద ఉంచగా.. ఆయన వాటిని వేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారడంతో వివాదాస్పదం అయింది. అనంతరం ఈ విషయమై మీడియా ఆయన్ను ప్రశ్నించగా.. జెండా ఎగురవేసే క్రమంలో షూ వదిలాను. వాటిని ఎవరూ పట్టుకోలేదని.. తనపై వచ్చిన ఆరోపణలను కొట్టేశారు.  


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని